నిర్మాతలు వరుసగా సినిమాలు ఎందుకు చేస్తారంటే
హీరోయిన్ గా ఉండటం చాలా హ్యాపీగా ఉంటుందని, అందరికంటే ఆఖరిగా షూటింగ్ కు వచ్చి, ముందుగా వెళ్లిపోవచ్చు.
By: Tupaki Desk | 16 May 2025 6:26 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిగా తన సత్తాను చాటి తానెంటో ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు నిర్మాతగా కూడా తన టాలెంట్ ను బయటపెట్టాలని పూనుకున్న సమంత అందులో భాగంగానే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను ఏర్పాటు చేసి అందులో మొదటి సినిమాగా శుభం అనే సీరియల్ కామెడీని నిర్మించింది.
మే 9న రిలీజైన శుభం సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ సమంత ఈ సినిమాను నిర్మించినందుకు కూడా మంచి ప్రశంసలొచ్చాయి. శుభం సినిమాను నిర్మించడమే కాకుండా అందులో ఓ గెస్ట్ రోల్ చేసి అందరినీ మెప్పించిన సమంత తాజాగా సక్సెస్ మీట్ లో మీడియా ముందుకొచ్చి తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది.
రీసెంట్ గా ఏదో ఆలోచిస్తున్నప్పుడు అసలు నేను ప్రొడక్షన్ వైపుకి ఇంత ధైర్యం చేసి ఎలా వచ్చానా అని అనుకున్నానని చెప్పిన సమంత, నిర్మాతలు వరుసపెట్టి సినిమాలెందుకు చేస్తారో తనకు ఇప్పుడే అర్థమైందని తెలిపింది. ఆడియన్స్ ఫేస్ లో చిరునవ్వులు చూడటానికే నిర్మాతలు సినిమాలు చేయడానికి కారణమని సమంత చెప్పింది.
స్టూడెంట్ గా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ తో మా కోసం అమ్మ ఎంత కష్టపడిందో ఇప్పుడు తెలిసిందని, పిల్లల్ని డిజప్పాయింట్ చేయకూడదు, వాళ్లను సినిమాకు తీసుకెళ్లాలని పరితపించేదని, మేం థియేటర్లో సినిమా చూడటం, పాప్కార్న్ కోసం సోదరుడితో గొడవ పడటం, చూసొచ్చిన సినిమా గురించి డిస్కస్ చేసుకోవడం ఇదంతా నిన్ననే జరిగినట్టు అనిపిస్తుందని, అప్పటి మెమొరీస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం రీక్రియేట్ చేయాలనిపించే ట్రాలాలా బ్యానర్ ను స్టార్ట్ చేశానని సమంత చెప్పుకొచ్చింది.
హీరోయిన్ గా ఉండటం చాలా హ్యాపీగా ఉంటుందని, అందరికంటే ఆఖరిగా షూటింగ్ కు వచ్చి, ముందుగా వెళ్లిపోవచ్చు. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఏదీ పట్టించుకునే పని ఉండదని, మన పని మనం చూసుకుంటూ వెళ్తే సరిపోయేది. రిలీజయ్యాక వచ్చే రివ్యూలో కూడా నా గురించి ఏం రాశారనేదే చూసుకునేదాన్నని, ఈ విషయంలో తాను కాస్త్ సెల్ఫిష్నే అని చెప్పిన సమంత, నిర్మాతగా ఉండటం చాలా కష్టమని, అన్ని మనమే చూసుకోవాల్సి వస్తుందని తెలిపింది. కానీ శుభం సినిమాకు తాను కష్టపడింది చాలా తక్కువని, ట్రాలాలా బ్యానర్ కు మంచి టీమ్ ఉందని, శుభం సినిమా సక్సెస్ కు వచ్చే అభినందనలన్నీ వారికే చెందుతాయని సమంత ఈ సందర్భంగా తెలిపింది.