ఆర్సీ 17 డైరెక్టర్ మారుతున్నాడా?
ఆర్సీ 17 సుకుమార్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. 'గేమ్ ఛేంజర్' సెట్స్ లో ఉండగానే రామ్ చరణ్ తో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసారు.
By: Tupaki Desk | 16 May 2025 3:03 PM ISTఆర్సీ 17 సుకుమార్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. 'గేమ్ ఛేంజర్' సెట్స్ లో ఉండగానే రామ్ చరణ్ తో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. అటుపై ఆర్సీ 16 పెద్ది సెట్స్ కు వెళ్లగానే మరోసారి అదే విషయాన్ని కన్పమ్ చేసారు. 'పెద్ది' సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడంతో? ఇద్దరు అండర్ స్టాండింగ్ మీద ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నట్లు కనిపించింది.
ఒకవేళ సుకుమార్ కోసమే అనుకుంటే రామ్ చరణ్ శిష్యుడిని సైతం పక్కనబెట్టేసేవాడు. ఎందుకంటే అప్పటికే 'రంగస్థలం'తో సుకుమార్ ఓ బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చాడు. అప్పటికి బంతి సుకుమార్ కోర్టులోనే ఉంది. కానీ సుకుమార్ ఆ ఛాన్స్ తీసుకోకుండా సమభావం పాటించాడు. శిష్యుడు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చేద్దామని వెయిట్ చేస్తున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం సుకుమార్ స్థానంలో కొత్త దర్శకుడిని తెరపైకి తెస్తున్నట్లు తాజాగా మెగా క్యాంప్ వర్గాల నుంచి ఓ వార్త లీకైంది.
సుకుమార్ కంటే ముందుగా త్రివిక్రమ్ తో ఓసినిమా చేయాలనుకుంటున్నాడట. అంటే 17వ సినిమా దర్శకుడు మారుతున్నట్లే కదా? ఈ చిత్రాన్ని ఇలా ప్లాన్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని సమా చారం. ఈ స్టోరీని తొలుత పవన్ కు చెప్పగా తనకంటే చరణ్ కి అయితే ఇంకా బాగుంటుందని భావించి గురూజీని అటువైపు మళ్లించాడట. స్టోరీ విన్న చరణ్ కూడా పాజిటివ్ గా స్పందించాడట.
ఆ స్టోరీ వీలైనంత త్వరగా చేయాలని డిలే చేయడానికి ఆస్కారం లేని స్క్రిప్ట్ గా వ్యక్తిగతంగా పవన్ ఒత్తిడి తెస్తున్నాడట. పవన్ మాట చరణ్ ఎలాగూ కాదనలేడు. బాబాయ్ ముందు పవన్ మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఆయన ఆదేశాలిస్తే ఈయన పాటించడమే. అలాగే ఈచిత్రాన్ని త్రివిక్రమ్ బ్యానర్ తోపాటు పవన్ సొంత సంస్థలో నిర్మించాలన్నది ప్లాన్ అట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.