కాల్పుల విరమణతో మళ్లీ దూకుడు?
బ్లాక్ బస్టర్` రైడ్` కీ సీక్వెల్ గా తెరకెక్కిన `రైడ్ 2` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 May 2025 11:36 AM ISTబ్లాక్ బస్టర్` రైడ్` కీ సీక్వెల్ గా తెరకెక్కిన `రైడ్ 2` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి షోతో నే `రైడ్ 2` హిట్ టాక్ వచ్చేసింది. దీంతో సినిమాకు ఓపెనింగ్స్ అంతకంతకు పెరిగాయి. అమయ్ పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగణ్ మరోసారి ప్రేక్షకుల్ని పట్టేసాడు. ప్రతి నాయకుడిగా పాత్రలో రితేష్ దేశ్ ముఖ్ అంతే అలరించాడు. మొదటి భాగంలో `రైడ్` ఇలియానా నటించగా రెండవ భాగంలో ఆమె స్థానంలో వాణీ కపూర్ ను తీసుకున్నారు.
ఇందులో వాణీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ కనిపించినంత సేపు అలరించింది. సినిమా సక్సెస్ అవ్వడంతో వాణీ ఖాతాలో మరో హిట్ నమోదైంది. ఈ చిత్రం తొలి వారంలో 95 కోట్లకు పైగా వసూళ్లను సాధిందింది. దీంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయి అనుకుంటోన్న సమయంలో భారత్-పాకిస్తాన్ వార్ మొదలవ్వడంతో సన్నివేశం రివర్స్ అయింది. జనాలు థియేటర్ కు వెళ్లకపొవ డంతో వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి.
చాలా రాష్ట్రల్లో బ్లాకౌట్ విధించడంతో బెంబేలెత్తిపోయే పరిస్థితి తలెత్తడంతో? రైడ్ వసూళ్లపై చాలా ప్రభావం పడింది. అటుపై కాల్పుల విరమణ జరిగినప్పటికీ పాక్ వక్రబుద్దిని దృష్టిలో పెట్టుకుని థియేటర్ కు వెళ్లడానికి జనాలు బయపడ్డారు. అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. మళ్లీ వసూళ్లు పుంజుకుంటున్నాయి. ఈ సినిమా 200 కోట్ల మార్క్ ను రీచ్ అవ్వడానికి అతి చేరువలో ఉంది.
ఇప్పటికే చిత్రం 170 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీగా మరో సినిమా కూడా లేకపోవడంతో ఈ వారమంతా `రైడ్ 2` దే హవా. ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్ లో టీసీరిస్ -పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ కుమార్ గుప్తానే తెరకె క్కించాడు.