అతడు తప్పుకోలేదు, అసలు విషయం ఏంటంటే..!
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ల్లో ఒకటి అయిన 'నో ఎంట్రీ 2' గురించి గత రెండు రోజులుగా ప్రముఖంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
By: Tupaki Desk | 16 May 2025 5:00 PM ISTబాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ల్లో ఒకటి అయిన 'నో ఎంట్రీ 2' గురించి గత రెండు రోజులుగా ప్రముఖంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్లు నటిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఈ ముగ్గురి కలయిక కారణంగా ఇది ఒక బిగ్ మల్టీస్టారర్ సినిమాగా నిలువబోతుందని బాలీవుడ్ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుతూ వచ్చారు. అయితే సినిమా గురించి ప్రచారం జరగడం మొదలుకుని ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ మల్టీ స్టారర్ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేయగా, సినిమాపై అంచనాలు పెరగడంలో దోహదపడ్డాయి.
తాజాగా నో ఎంట్రీ 2 సినిమా నుంచి పంజాబీ సింగర్ కమ్ యాక్టర్ దిల్జీజ్ దోసాంజ్ తప్పుకున్నాడనే వార్తలు జోరుగా వస్తున్నాయి. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ లు ఈ మధ్య కాలంలో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ నిలువలేక పోయాయి. వారి సినిమాలు అంటేనే జనాల్లో ఆసక్తి తగ్గింది. ఇలాంటి సమయంలో వారితో కలిసి నటించడం అనేది వృధా ప్రయాస అనే ఉద్దేశంతో దోసాంజ్ ఈ మల్టీస్టారర్ మూవీ నుంచి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని నిర్మాత బోణీ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా బోణీ కపూర్ స్పందిస్తూ నో ఎంట్రీ సినిమా గురించి వస్తున్న పుకార్లను కొట్టి పారేశాడు. మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పాడు.
నో ఎంట్రీ 2 సినిమా షూటింగ్ విషయంలో కాస్త జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. దిల్జీజ్ దోసాంజ్ తో క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నాడు. నో ఎంట్రీ 2 నుంచి ఆయన తప్పుకోలేదని కూడా చెప్పుకొచ్చాడు. సినిమాలో ఆయన నటిస్తున్నాడు. అయితే ముగ్గురు హీరోల డేట్లు మ్యాచ్ కాకపోవడంతో ఎక్కువగా షూటింగ్ జరపలేక పోతున్నామని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. తప్పకుండా దోసాంజ్ సినిమాలో నటిస్తాడనే విశ్వాసంను బోణీ కపూర్ వ్యక్తం చేశాడు. నో ఎంట్రీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నో ఎంట్రీ 2 కి మంచి బజ్ క్రియేట్ అయింది.
సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్, బిపాషా బసు ముఖ్య పాత్రల్లో నటించిన నో ఎంట్రీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇన్నాళ్ల తర్వాత సీక్వెల్కి మేకర్స్ రెడీ అయ్యారు. రీమేక్, సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతున్న ఈ సమయంలో నో ఎంట్రీ కి భారీ ఎత్తున సీక్వెల్ ప్లాన్ చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే ఉద్దేశంతో బోణీ కపూర్ ముందుకు వచ్చాడు. సీక్వెల్ పై ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ముగ్గురు హీరోలతో సినిమాను ప్లాన్ చేశాడు. ఇది ఒక బిగ్ మల్టీస్టారర్ మూవీగా ఉంటుందని మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే సినిమా పూర్తి అవుతుందా... డేట్ల సమస్య వల్ల సినిమా నుంచి ఎవరైనా తప్పుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.