నో పబ్లిసిటీ ఆ లెక్కలేంటీ లాలిటన్?
విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ ఎంటర్ టైనర్స్, ఫ్యామిలీ మూవీస్తో మలయాళ సూపర్స్టార్గా తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్న మోహన్ లాల్ ఇటీవల రెండు సినిమాలు చేశారు.
By: Tupaki Desk | 13 May 2025 3:00 PM ISTఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నా, దాన్ని వారు ఆదరించాలన్నా ప్రధానంగా పబ్లిసిటీ కీ రోల్ పోషిస్తుంటుంది. దీని కోసం భారీ చిత్రాల నిర్మాతలతో పాటు చిన్న సినిమాల మేకర్స్ కూడా పబ్లిసిటీకి భారీ ప్రాధాన్యతనిచ్చి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఫలితంగా సినిమా ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో రీచ్ అయి సినిమా ఆశించిన విధంగా వసూళ్లని రాబడుతూ ఉంటుంది. అయితే మలయాళ సూపర్ స్టార్, ఆయనతో సినిమాలు చేస్తున్న వారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఆయనే మోహన్లాల్. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ ఎంటర్ టైనర్స్, ఫ్యామిలీ మూవీస్తో మలయాళ సూపర్స్టార్గా తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్న మోహన్ లాల్ ఇటీవల రెండు సినిమాలు చేశారు. ఒకటి భారీ బడ్జెట్తో నిర్మించిన `ఎంపూరన్ 2`. మరొకటి నూతన నిర్మాణ సంస్థ నిర్మించిన `తుడరుమ్`. ఇక ఇందులో `ఎంపురాన్ 2`ని రూ.150 కోట్లకుపై బడ్జెట్తో నిర్మిస్తే.. `తుడరుమ్`కేవలం 28 కోట్లతో నిర్మించారు. ఈ రెండు ఇటీవల విడుదలై మలయాళంతో పాటు తెలుగులోనూ భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి.
అయితే `ఎంపురాన్ 2` కోసం భారీ స్థాయిలో పబ్లిసిటీ చేశారు. ఇందు కోసం భారీగా ఖర్చు చేశారు. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. మలయాళ ఇండస్ట్రీలో ఈ స్థాయి వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచి మోహన్లాల్ కెరీర్లోనే అత్యధికవసూళ్లని రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. దీనికి భిన్నంగా విడుదలైన మూవీ `తుడరుమ్`. దీనికి `ఎంపురాన్ 2` తరహాలో మేకర్స్ ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు.
మోహన్ లాల్ కేవలం రెండు మూడు ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు అంతే. కేవలం మౌత్ టాక్తో ఈ సినిమా ఎవరూ ఊహించని మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్గా విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే రూ.200 కోట్ల మార్కుని రీచ్ కావడం విశేషం. వరుసగా రెండు సినిమాలు రూ.200 కోట్లు రాబట్టడంతో మోహన్ లాల్ తన పారితోషికాన్ని పెంచేశారట. సినిమాకు గతంలో రూ.5. నుంచి 6 కోట్లు మాత్రమే తీసుకునే ఆయన ఈ రెండు సినిమాల వసూళ్లతో తన పారితోషికాన్ని ఇక నుంచి రూ.20 కోట్లకు పెంచేశారట. అంతే కాకుండా గల్ఫ్ ఓవర్సీస్ రైట్స్ కూడా అడుగుతున్నారట. దీంతో ఈ లెక్కలేంటీ లాలిటన్ అని మలయాళ ప్రొడ్యూసర్లు వాపోతున్నారట.