లోకేష్ కనగరాజ్ లక్కీ ఎస్కేప్!
లోకేష్ కనగరాజ్..దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో మరీ ముఖ్యంగా బాలీవుడ్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న పేరిది.
By: Tupaki Desk | 16 May 2025 2:30 PM ISTలోకేష్ కనగరాజ్..దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో మరీ ముఖ్యంగా బాలీవుడ్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న పేరిది. తనదైన మార్కు మేకింగ్తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. తన మార్కు సినిమాటిక్ యూనివర్స్ లో లోకేష్ చేసిన ఖైదీ, విక్రమ్, లీయో.. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అయితే లోకేష్ యూనివర్స్లో తెరకెక్కిన `లియో` మాత్రం ఆ స్థాయి ఇంపాక్ట్ని కలిగించలేకపోయింది.
సెకండ్ హాఫ్కు వచ్చేసరికి కథాగమనం పట్టుతప్పడంతో అనుకున్న ఫలితం దక్కలేదు. కానీ దేశ వ్యప్తంగా మాత్రం లోకేష్ కనగరాజ్కు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో చాలా మంది హీరోలు తనతో సినిమా చేయాలని ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా `కూలీ` మూవీ చేస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సారి హిందీ మార్కెట్ని కూడా గట్టిగానే కొట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే అమీర్ఖాన్తో గెస్ట్ రోల్ చేయించారని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే డైరెక్టర్గా భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్తో టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలు చేయబోతున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ అది జరగలేదు.
లోకేష్తో రామ్ చరణ్ భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది. విక్రమ్ తరువాత తెలుగు స్టార్ హీరోలు తనకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారని కూడా వార్తలు షికారు చేశాయి కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో లోకేష్ తెలుగు హీరోలతో చేయడం లేదనే కామబెంట్లు మొదలయ్యాయి. లోకేష్ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణమే ఉందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగు హీరోతో ప్రాజెక్ట్ సెట్ అయితే ఆ ప్రొడక్షన్ కంపనీలో ఏడాది నుంచి రెండేళ్ల వరకు లాక్ కావాల్సిన పరిస్థితి. ఆ కారణంగా తెలగు సినిమా అంటే లోకేష్ ఎస్కేప్ అవుతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.