వాళ్ల మాటలకు నాపై నాకే జాలేసింది
రీసెంట్ గా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 16 May 2025 3:05 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో రైటర్ కు ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. కొన్ని సినిమా కథలను బట్టి దాన్ని ఎవరు రాశారో చెప్పేయొచ్చు. కొంతమందికి ఆ స్టైల్ ఉంటుంది. టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా రైటర్ గా కొనసాగుతున్న కోన వెంకట్ కు కూడా అలాంటి ఓ రైటింగ్ స్టైల్ ఉంది. తను అనుకున్న కథకు కామెడీని జోడించి ఆడియన్స్ ను మెప్పించగలడు కోన వెంకట్.
ఢీ, రెడీ, అదుర్స్, దూకుడు లాంటి సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన కోన వెంకట్ ఒకప్పుడు స్టార్ రైటర్ గా ఓ వెలుగు వెలిగాడు. ఈ మధ్య కోన వెంకట్ నుంచి ఆడియన్స్ తో వావ్ అనిపించే కథ వచ్చింది లేదు. రీసెంట్ గా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఢీ సినిమా తర్వాత అదే ఫార్ములాతో తాను చాలా సినిమాలు చేశానని, కానీ ఆ సినిమాలన్నీ మంచి సక్సెస్ గా నిలిచాయని చెప్పాడు. అదే టైమ్ లో ఆడియన్స్ నుంచి ఈ విషయంలో తనపై చాలా తీవ్ర విమర్శలు వచ్చాయని, ఈ బకరా కామెడీల నుంచి కోన వెంకట్ ఎప్పుడు బయటికి వస్తాడో అని అన్నారని, వాళ్ల మాటలకు తనపై తనకే జాలేసిందని కోన చెప్పుకొచ్చాడు.
హీరో వేరే ఇంటికి వెళ్లడం, అక్కడి వాళ్లను బకరాలను చేయడం, ఆ క్రమంలో వచ్చే కామెడీ నేపథ్యంలో ఓ ఫార్ములాని కనిపెట్టి, అదే బ్యాక్ డ్రాప్ తో ఎన్నో సినిమాలు చేశానని, తాను రైటర్ గా వర్క్ చేసిన సినిమాలే కాకుండా ఇదే కాన్సెప్ట్ లో పలు సినిమాలొచ్చాయని, ఆఖరికి తన ఫార్ములపై తనకే బోర్ కొట్టేసిందని, పండగ చేస్కో సినిమా తర్వాత ఆ కాన్సెప్ట్ తో ఇక కథలు రాయలేదని కోన వెంకట్ తెలిపాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ కథ చాలా కొత్తగా ఉంటూనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందని, దీంతో పాటూ ఓ బాలీవుడ్ సినిమాక్కూడా తాను వర్క్ చేస్తున్నట్టు కోన వెంకట్ వెల్లడించాడు. నో ఎంట్రీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఆ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహించనున్నట్టు కోన తెలిపాడు.