అలాంటి మూర్ఖులను ప్రపంచంలో ఎవరూ మార్చలేరు
ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఎక్కువ అవకాశాలొస్తాయని ఎప్పుడూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
By: Tupaki Desk | 16 May 2025 9:00 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఎక్కువ అవకాశాలొస్తాయని ఎప్పుడూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వార్తల్లో నిజానిజాలంటనేది పక్కన పెడితే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చినా సక్సెస్ కానప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ దేనికీ ఉపయోగపడదు. బ్యాక్ గ్రౌండ్, వారసత్వమనేది కేవలం ఇండస్ట్రీలోకి వచ్చేవరకు మాత్రమే ఉపయోగపడుతుందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.
ఎవరేం చెప్పినా మాత్రం ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువని, దాని కారణం గానే ఎంతో మంది నటీనటులకి అన్యాయం జరిగిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్ లో ఈ నెపోటిజం కాస్త ఎక్కువగా ఉంటుంది. నెపోటిజం వల్లే అలియా భట్ ఇండస్ట్రీలోకి వచ్చిందని, దాని కారణంగానే అలియా ఇవాళ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతుందని చాలా మంది ఇప్పటికీ అంటూ ఉంటారు.
తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాలపై రెస్పాండ్ అయి మాట్లాడాడు. అందరూ అలియాను నెపో కిడ్ అంటారు, అలా అనుకునే వారిని తాను మూర్ఖులతో సమానంగా చూస్తానని చెప్పాడు. అలియా చేసిన సినిమాల్లో ఆమె నటన చూస్తే ఆమె నెపో కిడ్ అని ఎవరికీ అనిపించదని, అలియా యాక్టింగ్ ను ప్రశంసించాడు.
హైవే, రాజీ, గంగూబాయి కాఠియావాడి లాంటి సినిమాల్లో అలియా ఎంతో అద్భుతంగా నటించిందని, ఆ సినిమాలు చూసైనా అలియాను నెపో కిడ్ అనడం మానేయాలని కరణ్ చెప్పాడు. అవి చూశాక కూడా అలియాను నెపో కిడ్ అనే పిలిస్తే, వారి కంటే మూర్ఖులు మరొకరు ఉండరని, ప్రపంచంలోని ఎవరూ వాళ్లను బాగుచేయలేరని, అలియా మంచి నటి అని చెప్పాడు కరణ్.
ఈ సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ కేవలం స్టార్ కిడ్స్ కు మాత్రమే అవకాశాలిస్తుందనే విషయాన్ని కూడా కరణ్ ఖండించాడు. తన ధర్మ ప్రొడక్షన్స్ లో ఎంతోమంది బయటివారికి కూడా ఛాన్సులు ఇచ్చినట్టు కరణ్ తెలిపాడు. సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయమైన నాదానియన్ ను కరణ్ నిర్మించగా ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో కరణ్ పై ఈ విషయంలో బాగా విమర్శలు రాగా వాటిపై రెస్పాండ్ అవుతూ నాదానియన్ ను ట్రోల్ చేయడం అందరికీ ఫ్యాషనైపోయిందని, సినిమాను ఎంత ద్వేషిస్తే అదంత ఫేమస్ అవుతుందని, అయినా విమర్శించే ప్రతీ ఒక్కరికీ తాను వివరణ ఇవ్వలేనని ఎవరి అభిప్రాయాలు వాళ్లవని కరణ్ అన్నాడు.