రణ్బీర్ 'రామాయణ'లో మండోదరి ఎవరు?
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ రామాయణ ఇతిహాసాన్ని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.
By: Tupaki Desk | 16 May 2025 1:32 PM IST`దంగల్` చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నని దర్శకుడిగా రెండు వేల కోట్ల క్లబ్లో చేరిన నితేష్ తివారి ప్రస్తుతం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని `రామాయణ`గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. స్టోరీ స్క్రీన్ప్లే నమిత్మల్హోత్రా అందిస్తుండగా, స్టోరీని మాత్రం శ్రీధర్ రాఘవన్ అందిస్తున్నారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ మూవీని నమిత్మల్హోత్రా, హీరో యష్ నిర్మిస్తున్నారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ రామాయణ ఇతిహాసాన్ని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగాన్ని 2026 దీపావళికి విడుదల చేయనుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇందులో రావణుడిగా యష్ నటిస్తుండగా హను మంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాకెట్ స్పీడుతో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్గా మారింది.క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ మేగ్నమ్ ఓపస్ లో భాగం అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనుందని, ఆమె మండోదరిగా నటించనుందని ఇన్ సైడ్ టాక్. యష్ రావణాసుడిగా నటిస్తుండగా అతనికి జోడీగా రావణుడి సతీమణి పాత్రలో మండోదరిగా కాజల్ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.
అంతే కాకుండా ఇటీవలే కాజల్పై లుక్ టెస్ట్ కూడా జరిగిందని, త్వరలోనే టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే `రామయణ` అనుకున్న దానికి మించి భారీ స్థాయిలో ఉండనుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. భారతీయ సినిమాల్లో బడ్జెట్ పరంగా సరికొత్త చరిత్రకు నాందిపలకనున్న ఈ ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ల విషయంలోనూ చర్చనీయాంశంగా మారడం కాయం.