'ఆంధ్ర కింగ్ తాలూకా' గ్లింప్స్.. రెస్పాన్స్ ఎలా ఉందంటే?
టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో మరోసారి అభిమానులను డిఫరెంట్ గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
By: Tupaki Desk | 16 May 2025 4:58 PM ISTటాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో మరోసారి అభిమానులను డిఫరెంట్ గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారిగా ఓ ఫ్యాన్ జీవిత కథను తెరపైకి తీసుకొస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర సూపర్స్టార్ సూర్య కుమార్ పాత్రలో నటిస్తుండగా, రామ్ ఆయన డై హార్డ్ ఫ్యాన్ సాగర్గా కనిపించనున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, మహేష్ బాబు పి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా మే 15న విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 2000ల నాటి ఫ్యాన్ కల్చర్ను చూపిస్తూ, ఒక సూపర్స్టార్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల వద్ద జరిగే హడావిడిని ఈ గ్లింప్స్ అద్భుతంగా చూపించింది.
సాగర్గా రామ్ సైకిల్పై స్టైలిష్ ఎంట్రీ, 50 టికెట్లు డిమాండ్ చేస్తూ ఫ్యాన్ ఎమోషన్స్ను చూపించిన తీరు అందరినీ ఆకర్షించింది. ఈ గ్లింప్స్ అభిమానుల హృదయాలను తాకింది. ఈ గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 14 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, రామ్ కెరీర్లో 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన గ్లింప్స్గా రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్లో నిలిచిన ఈ గ్లింప్స్, ఫ్యాన్ కల్చర్ను ఎంత అద్భుతంగా చూపించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
2000లలో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాను చూసిన ప్రేక్షకులకు ఈ గ్లింప్స్ నాస్టాల్జియాను గుర్తు చేసింది, కొత్త తరం ప్రేక్షకులకు ఫ్యాన్ ఎమోషన్స్ను పరిచయం చేసింది. రామ్ పోతినేని స్టార్ హీరో అయినప్పటికీ, ఓ ఫ్యాన్ పాత్రలో నటించడం, ఆ పాత్రకు తగ్గట్లు లుక్, బాడీ లాంగ్వేజ్ను అద్భుతంగా ప్రజెంట్ చేయడం అందరినీ ఆకర్షించింది. ఈ సినిమా కథ ఎంపిక, రామ్ నటన అభిమానులను మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు.
ఈ గ్లింప్స్లో రామ్ సాగర్గా చూపించిన ఫ్యాన్ ఎటిట్యూడ్, స్వాగ్ అందరినీ ఆకట్టుకుంది. మహేష్ బాబు పి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న రెండో చిత్రం. ఫ్యాన్ ఎమోషన్స్ను క్రియేటివ్గా చూపించడంలో మహేష్ బాబు పి మరోసారి సక్సెస్ అయ్యాడని అంటున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మొత్తంగా, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ గ్లింప్స్ రామ్ కెరీర్లో ఓ ఐకానిక్ మూమెంట్గా నిలిచింది. 14 మిలియన్ల వ్యూస్తో సంచలనం సృష్టించిన ఈ గ్లింప్స్, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.