అవతారాలు పుట్టింది ధర్మ రక్షణ కోసమే..!
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వచ్చినవాడు గౌతం సినిమా టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీజర్ విజువల్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
By: Tupaki Desk | 15 May 2025 10:30 PM ISTఅశ్విన్ బాబు లీడ్ రోల్ లో ఎం.ఆర్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా వచ్చినవాడు గౌతమ్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ యువ హీరోగా తన మార్క్ చాటుతున్నాడు అశ్విన్. ఫలితాలు ఎలా ఉన్నా కూడా తన ప్రయత్నాలు మాత్రం ఆపకుండా చేస్తూనే ఉన్నాడు అశ్విన్. లేటెస్ట్ గా వచ్చినవాడు గౌతమ్ అంటూ ఒక క్రేజీ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ కి మంచు మనోజ్ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా 18 పర్వాల భారతంలో అయినా 12 స్కందాల భాగవతంలో అయినా అవతారాలు పుట్టింది ధర్మ రక్షణ కోసమే అంటూ టీజర్ లో సినిమా స్టోరీ నేపథ్యాన్ని చెప్పిన తీరు ఆకట్టుకుంది. మంచు మనోజ్ వాయిస్ ఓవర్ ఈ టీజర్ కి క్రేజీ థింగ్ గా మారిందని చెప్పొచ్చు.
ఇక సినిమా కథ ఏంటన్నది క్లారిటీ లేదు కానీ ధర్మ రక్షణ కోసం పోరాడే హీరోగా అశ్విన్ కనిపించనున్నాడు. తన ప్రతి సినిమా యాక్షన్ తో పాటు ఒక కంటెంట్ బేస్డ్ సినిమాగా చేస్తూ వస్తున్న అశ్విన్ మరోసారి వచ్చినవాడు గౌతం తో మరో ప్రయత్నం చేస్తున్నాడు. అశ్విన్ మరోసారి తన యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వచ్చినవాడు గౌతం సినిమా టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీజర్ విజువల్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో అశ్విన్ తో పాటు రియా సుమన్, అయేషా ఖాన్ కూడా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ తోనే సినిమాపై ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
యువ హీరోగా అశ్విన్ ప్రతి సినిమాతో ఒక కొత్త కథ కొత్త అటెంప్ట్ తో వస్తున్నాడు. ఐతే సినిమాల ఫలితాలు తనని నిరాశపరచినా సరే మళ్లీ మళ్లీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐతే ఈసారి వచ్చినవాడు గౌతం తో కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పించేలా ఉన్నాడు. టీజర్ చూస్తే సినిమా సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించేలా ఉంది. నిజంగానే అశ్విన్ సక్సెస్ అందుకుంటే ఇలాంటి ప్రయోగాలు అతను మరెన్నో చేసే ఛాన్స్ ఉంటుంది.