Begin typing your search above and press return to search.
ప్రభుత్వాధికారి పై బీజేపీ నేత 'చెప్పు'దాడి !
By: Tupaki Desk | 6 Jun 2020 8:50 AM GMTటిక్ టాక్ స్టార్ . బీజేపీ నేత సోనాలి ఫోగట్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. హిసార్ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుల్తాన్ సింగ్పై ఆమె చెప్పుతో దాడి చేశారు. శుక్రవారం బల్సామంద్ మండిలో సోనాలి పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హర్యానాకు చెందిన సొనాలి ఫోగట్.. హిస్సార్ జిల్లాలోని బల్సామండ్ మండికి రైతులతో కలిసి, మార్కెట్ కమిటీ అధికారులపై ఫిర్యాదులు రావడంతో వారితో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సుల్తాన్పై పొగట్ దాడికి దిగినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై సుల్తాన్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హిసార్ ఎస్పీ గంగా రామ్ పునియా తెలిపారు. పొగట్పై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నాపై అసభ్యంగా మాట్లాడతావా..? అంటూ పొగట్, సుల్తాన్పై చేయి చేసుకుంది. కాగా పొగట్, అధికారి పై దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సైలెంట్ గా ఉండటం గమనర్హం.
ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, సొనాలి ఫోగట్ పై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కొందరు ఆమె చేసింది సరైన పనేనంటూ సపోర్ట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ఓ నేత ఇలా ప్రవర్తించడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. కాగా గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నుంచి పోటీ చేసిన సోనాలి పొగట్, కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్నోయ్ చేతిలో ఓడిపోయారు.
హర్యానాకు చెందిన సొనాలి ఫోగట్.. హిస్సార్ జిల్లాలోని బల్సామండ్ మండికి రైతులతో కలిసి, మార్కెట్ కమిటీ అధికారులపై ఫిర్యాదులు రావడంతో వారితో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సుల్తాన్పై పొగట్ దాడికి దిగినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై సుల్తాన్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హిసార్ ఎస్పీ గంగా రామ్ పునియా తెలిపారు. పొగట్పై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నాపై అసభ్యంగా మాట్లాడతావా..? అంటూ పొగట్, సుల్తాన్పై చేయి చేసుకుంది. కాగా పొగట్, అధికారి పై దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సైలెంట్ గా ఉండటం గమనర్హం.
ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, సొనాలి ఫోగట్ పై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కొందరు ఆమె చేసింది సరైన పనేనంటూ సపోర్ట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ఓ నేత ఇలా ప్రవర్తించడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. కాగా గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నుంచి పోటీ చేసిన సోనాలి పొగట్, కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్నోయ్ చేతిలో ఓడిపోయారు.