Begin typing your search above and press return to search.

స్నాక్స్ అమ్ముతూ కోట్లు .. అక్కడ 250మందికి పైగా కోటీశ్వరులే !

By:  Tupaki Desk   |   22 July 2021 5:26 AM GMT
స్నాక్స్ అమ్ముతూ కోట్లు .. అక్కడ 250మందికి పైగా కోటీశ్వరులే !
X
ప్రస్తుతం రోజుల్లో బాగా పాపులర్ హోటల్స్ కి ఎంత డిమాండ్ ఉందొ .. రోడ్డు వెంబడి ఉండే బండ్లకి కూడా అంతే డిమాండ్ ఉంది. తక్కువ ఖర్చు .. ఎక్కువ టేస్ట్ ఉండటంతో చాలామంది హోటల్స్ లో కంటే రోడ్డుమీద ఉండే బండ్లపైనే తినేస్తుంటారు. రోడ్డుమీద చాయ్, సమోసా, పాన్, చాట్, భజ్జిలు అమ్ముకునే వారే కదా అని వారిని తక్కువగా చూడకండి. ఎందుకంటే వారిలో కూడా ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని రోడ్డు పై చాట్, చాయ్, సమోసా. పాన్ అమ్మే వ్యాపారం చేస్తున్నవారిలో లక్షాధికారులున్నారని వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాన్పూర్ లో ఒకరు కాదు. ఇద్దరు కాదు ఏకంగా 250మందికి పైగా కోటీశ్వరులు ఉన్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వీరిలో ఎక్కువమంది పేదవారిగా పరిగణింపబడుతున్న చిన్న కిరాణా దుకాణ యజమానులు, టీ , సమోసా, చాట్ అమ్ముకునేవారే, వీరి సంపాదన రసాయన శాస్త్రవేత్తల కంటే ఎక్కువ అని ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో కొంతమంది పండ్లని విక్రయించేవారున్నారని, వారికీ ఏకంగా వందల ఎకరాల సాగు భూమి ఉందని, ఈ భూమి యజమాములు పన్నులు కట్టడం లేదని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కాలంలో లక్షలు జీతం సంధించుకునేవారు కూడా ఆర్ధిక ఇబ్బందులను, ఈఎంఐ  చెల్లించడంలో సమస్యను ఎదుర్కొన్నారు. కాని కాన్పూర్ లో మాత్రం స్క్రాప్ డీలర్లకు కూడా మూడు కార్లు ఉన్నాయి. అయితే ఇంతటి ధనవంతులు కూడా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించరు.

జీఎస్టీతో ఎటువంటి సంబంధం లేదు. నగరంలోని లాల్‌ బంగ్లా ప్రాంతంలో ఒకరికి, బెకోంగంజ్‌ లోని ఇద్దరు స్క్రాప్ డీలర్లు రెండేళ్లలో రూ .10 కోట్లకు పైగా విలువైన మూడు ఆస్తులను కొనుగోలు చేశారు. పేదలుగా కనిపించే ఈ ధనవంతులుపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది చిరు వ్యాపారాలు కోటీశ్వరులున్నాయని వెల్లడైంది. డేటా సాఫ్ట్‌ వేర్ , ఇతర సాంకేతిక విధానాలతో ఈ వ్యాపారుల వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు షాక్ తిన్నారు. ఈ వ్యాపారస్థులు ఒక్క పైసా జీఎస్టీ చెల్లించలేదు. కానీ, నాలుగేళ్లలో రూ. 375 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు.

ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో ఈ ఆస్తులను కొనుగోలు చేశారు. దక్షిణ కాన్పూర్‌లో కూడా ఆస్తులు కొన్నారు. ఆర్యనగర్‌ లో పాన్ షాపు లోని ఇద్దరు యజమానులు కరోనా వైరస్ కాలంలో రూ .5 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు. ఇక మరోవైపు మాల్‌ రోడ్‌ కు చెందిన పల్లీలు అమ్ముకునే వ్యాపారి, ప్రతి నెల వివిధ బండ్లపై రూ .1.25 లక్షలు అద్దెకు చెల్లిస్తున్నాడు. మరోవైపు, స్వరూప్ నగర్, హులగంజ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు భవనాలను కొనుగోలు చేయగా చాట్ అమ్మకందారులు భూమిపై భారీగా పెట్టుబడి పెట్టారు. మొత్తానికి కాన్పూర్ లోని కోట్లాది రూపాయలను సంపాదిస్తున్న చిరు వ్యాపారుల సంపాదన శాస్త్రవేత్తల సంపాదన కంటే 65 శాతం ఎక్కువ. ప్రభుత్వం  కన్ను కప్పడానికి కొంతమంది సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక పథకాలను ఆశ్రయించగా .. మరికొందరు తమ ఫ్యామిలీ సభ్యుల పేరుతో ఆస్తులను కొన్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు లు ద్వారా ఈ ఆస్తుల చిట్టా రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.