Begin typing your search above and press return to search.

కేసీఆర్, కేటీఆర్ లపై ఫైర్ అయిన పొంగులేటి

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:29 PM GMT
కేసీఆర్, కేటీఆర్ లపై ఫైర్ అయిన పొంగులేటి
X
బీఆర్ఎస్ లో అసమ్మతి రాజేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్లీ ఫైర్ అయ్యారు.ఖమ్మం జిల్లా మధిరలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి పార్టీలో చేరి మోసపోయానని సంచలన కామెంట్స్ చేశారు.

‘నాకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. ప్రజాభిమానం లేని వ్యక్తులు ఎన్నికల్లో ఓడితే ఆ నెపం నాపై నెట్టారు. నాకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా పార్టీని గెలిపించడానికి కృషి చేశాను. మధిర మున్సిపల్ ఎన్నికల్లో నా వల్లే పార్టీ గెలిచింది' అని పొంగులేటి ఫైర్ అయ్యారు.

అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని పొంగులేటి రెచ్చిపోయారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడుగు వేయను అని స్పష్టం చేశారు. నాడు కురుక్షేత్రంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారని.. కానీ నేడు శీనన్న వెంట లక్షలాది హృదయాల మద్దతు ఉందని.. ఆ తుఫానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం అని వ్యాఖ్యానించారు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తనను జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం తమ గుండెల్లో పెట్టి చూసుకుంటోందని.. జిల్లాలోని ప్రజా ప్రతినిధులంతా తన పక్షానే నడుస్తున్నారని తెలిపారు.నమ్ముకున్న కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విషయంలో వెనుకడుగు వేయబోనన్నారు.

ఒకప్పుడు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను, ఖమ్మం ఎంపీగా ఉన్నప్పుడు వారి మాటలు నమ్మి టీఆర్ఎస్ లో చేరారు. నాతోపాటు వందలాది మంది ప్రజాప్రతినిధులు, వేలాది మంది అభిమానులు టీఆర్ఎస్ కు జైకొట్టారు. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీుల నెరవేర్చకపోవడమే కాకుండా జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేశానంటూ నాపై నిందలు మోపారు. ఆ తర్వాత పెద్దలు కేసీఆర్, కేటీఆర్ మాట విని నాడు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం గ్రామగ్రామాన తిరిగి గెలిపించాను. కానీ నన్నే ఇబ్బందులు పెట్టారంటూ కేసీఆర్, కేటీఆర్ పై పొంగులేటి తీవ్ర విమర్శలు గుప్పించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.