Begin typing your search above and press return to search.

విద్యార్థినిపై అత్యాచారం.. అబార్షన్.. వ్యక్తికి యావజ్జీవ శిక్ష

By:  Tupaki Desk   |   8 May 2021 12:30 AM GMT
విద్యార్థినిపై అత్యాచారం.. అబార్షన్.. వ్యక్తికి యావజ్జీవ శిక్ష
X
అభం శుభం తెలియని విద్యార్థిని మాయమాటలు చెప్పాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాధత బాలిక గర్భం దాల్చింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించాలని అనుకున్నాడు. ఏవో మాత్రలు వేయించాడు. అబార్షన్ అయ్యింది కానీ ఆమె ఆరోగ్యం క్షీణించింది.బాలిక తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది.

తమిళనాడులోని పుదుక్కొట్టై సత్యమంగళం పసుంపొన్ నగర్ కు చెందిన సురేష్ (32) అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినిపై పలు మార్లు అత్యాచారం చేశాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. బాలిక పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి పాలైంది.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పుదుక్కోట్టై మహిళా కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై అత్యాచారం, అబార్షన్ నేరం కింద యావజ్జీవ శిక్ష విధించారు.