Begin typing your search above and press return to search.

ఒక్క ట్వీట్ తో ఫుల్ జోష్ తెచ్చిన కవిత.. సోషల్​మీడియాలో అదిరిపోయే వీడియో!

By:  Tupaki Desk   |   18 Nov 2020 10:50 AM GMT
ఒక్క ట్వీట్ తో ఫుల్ జోష్ తెచ్చిన  కవిత.. సోషల్​మీడియాలో అదిరిపోయే వీడియో!
X
నిజామాబాద్​ ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కేసీఆర్​ కుమార్తె కల్వకుంట్ల కవిత కొంతకాలం సైలంట్​ అయిపోయారు. నిజామాబాద్​ జిల్లా నేతలతో కూడా ఆమె పెద్దగా టచ్ ​లో లేరు. కొంతమంది పార్టీ ముఖ్య నాయకులతో మాత్రమే మాట్లాడేవారు. పార్లమెంట్​ ఎన్నికల్లో కవిత ఓడిపోయాక ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆ తర్వాత మంత్రిని చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కొంతకాలం పాటు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు సాగలేదు. కవిత కూడా అప్పుడప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడేవారు. కానీ అందరూ ఊహించినట్టుగానే చివరకు సీఎం కేసీఆర్​ నిజామాబాద్​ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను పోటీచేయించారు. కవిత భారీ మెజార్టీతో గెలుపొందారు.

అయితే ఆ తర్వాత తెలంగాణలో మంత్రివర్గ పునర్ ​వ్యవస్థీకరణ జరుగబోతున్నదని.. ఇద్దరు మంత్రులను పక్కనపెట్టబెట్ట బోతున్నారని కవితకు క్యాబినెట్​లో బెర్త్​ కన్​ఫార్మ్​ అయిందన్న వార్తలు వినిపించాయి. ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. కానీ ప్రస్తుతం జీహెచ్​ఎంసీ నోటిఫికేషన్​ విడుదల కావడంతో ఎమ్మెల్సీ కవిత మరోసారి యాక్టివ్​ అయ్యారు. బుధవారం ట్విట్టర్​ లో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సారి ఎన్నికల్లో టీఆర్​ఎస్​ గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఆరేళ్లలో హైదరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలందరకూ తెలుసన్నారు. అభివృద్ది కొనసాగాలంటే ప్రజలు టీఆర్​ఎస్​ కే ఓటేయాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ మహానగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతిభద్రతలు.. ఇవన్నీ సీఎం కేసీఆర్‌ - టీఆర్‌ఎస్‌ పార్టీ కారణంగానే ఇంత గొప్పగా ఉన్నాయన్నారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూాడా నగరానికి వచ్చాయన్నారు. ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ ప్రజలపై ఉందన్నారు. నగరం వరుసగా ఐదేళ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయన్న విషయాన్ని కూడా కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత దుబ్బాక ఎన్నికల్లో సోషల్​మీడియా ఎఫెక్ట్​ తోనే టీఆర్ ​ఎస్​ నష్టపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి టీఆర్​ ఎస్​ కూడా సోషల్ ​మీడియాలో క్రియాశీలకపాత్ర పోషించనున్నది. ఇప్పటికే మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత సోషల్​మీడియాలో యాక్టివ్ ​గా ఉంటారు. వారికున్న అవకాశాలను వాడుకొని ఈ సారి మరింత ముమ్మరంగా ప్రచారం చేయబోతున్నారు.