Begin typing your search above and press return to search.

అంత భారీగా సాగిన ప్లీనరీ కి కవితక్క రాకపోవటం ఏమిటి?

By:  Tupaki Desk   |   27 Oct 2021 4:58 AM GMT
అంత భారీగా సాగిన ప్లీనరీ కి కవితక్క రాకపోవటం ఏమిటి?
X
అంగరంగ వైభవం గా జరిగిన ఒక రోజు టీఆర్ఎస్ ప్లీనరీ రాష్ట్రంలోనే కాదు. ఏపీ లోనూ హాట్ టాపిక్ గా మారింది. భారీ ఎత్తున నిర్వహించిన ప్లీనరీ లో సుదీర్ఘం గా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘం గా ఉపన్యాసం ఇవ్వటం..ఎప్పటి మాదిరే ఆకట్టుకునేలా ఆయన ప్రసంగం సాగటం తెలిసిందే. ప్రత్యేక సందర్భం ఏదైనా సరే.. గతాన్ని.. వర్తమానాన్ని.. భవిష్యత్తు ను ఒక క్రమపద్దతి లో ఆవిష్కరించే ఆనవాయితీని మిస్ కాకుండా ఆయన సమైక్య పాలకుల మీద ఆగ్రహాన్ని.. వారి చేష్టల కు తన మనసు ఎంత బాధ పడిందన్న విషయాన్ని ఎమోషనల్ గా చెప్పటమే కాదు.. తమ చేతి కి అధికారం వచ్చాక తెలంగాణ రూపు రేఖల్ని ఎంతలా మార్చేశారన్న దాని కి నిదర్శనం గా ఆయన మాటలు సాగాయి.

ఇదంతా ఒక ఎత్తు. గులాబీ ప్లీనరీ ని చూస్తే.. మొత్తం గా పార్టీ అధినేత కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆరే మొత్తం గా కనిపించారే తప్పించి మరెవరూ కనిపించలేదు. తండ్రి కొడుకుల సెంట్రిక్ గానే ప్లీనరీ సాగింది. అయితే.. ఈ ప్లీనరీ లో పెద్దగా చర్చకు రాని ఆసక్తికర ఉదంతాలుకొన్ని చోటు చేసుకున్నాయి. మీడియా లోనూ వీటి గురించి పెద్దగా ప్రస్తావించకపోవటం గమనార్హం.

కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ప్లీనరీ లో ఎంతటి ప్రాధాన్యత లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత విషయం లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఆ మాట కు వస్తే.. ప్లీనరీ కి ఆమె రాలేదు కూడా. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర ను తక్కువ చేసి చూపలేం. అలాంటి కవిత ఇటీవల కాలంలో అంత గా యాక్టివ్ గా లేరన్న మాట వినిపిస్తోంది. ఆ వాదన కు బలం చేకూరేలా తాజా గా జరిగిన ప్లీనరీ కి ఆమె రాకపోవటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. దీని కి కారణం ఏమిటని ఆరా తీస్తే.. ఆరోగ్యం బాగోలేదన్న మాట కొందరి నోట.. కుటుంబం లో నెలకొన్న ఇష్యూల కారణం గానే ఆమె రాలేదన్న మాట వినిపిస్తోంది.

పార్టీ లో తన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారంటూ కవిత గుర్రు గా ఉన్నారంటూ ఇటీవల కాలం లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్టీ కి సంబంధించిన కీలక వ్యవహారాల సమయం లో ఆమె కనిపించట్లేదు. తాజా గా జరిగిన ప్లీనరీ కూడా దీని కో ఉదాహరణ గా చెప్పొచ్చు. అయితే.. ఈ వాదన లో నిజం లేదని.. కవిత కు ఆరోగ్యం బాగా లేదని.. ఈ కారణం తోనే ఆమె రాలేదని చెబుతున్నారు. ఒక వేళ అదే నిజమైతే.. ప్లీనరీ వేళ ఆ విషయాన్ని సందర్భో చితంగా ప్రకటిస్తే.. అనవసరమైన వాదనలకు చెక్ పెట్టే వీలుండేది కదా అన్న మాట వినిపిస్తోంది. అయినా.. ప్రదాన మీడియా సైతం కవితక్క ప్లీనరీ కి రాని విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఏమిటి?