Begin typing your search above and press return to search.

బాసర ఆర్జీయూకేటీ: నిన్న ఉరేసుకొని .. ఈరోజు 4వ అంతస్తు నుంచి..

By:  Tupaki Desk   |   15 Jun 2023 2:13 PM GMT
బాసర ఆర్జీయూకేటీ: నిన్న ఉరేసుకొని .. ఈరోజు 4వ అంతస్తు నుంచి..
X
బాసర ఆర్జీయూకే టీలో విద్యార్థులు సరైన వసతులు లేవని ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఓ విద్యార్ధిని ఆత్మ హత్యకు పాల్పడటంతో విషాదం చోటు చేసుకుంది. వరుసగా రెండో రోజు మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాసర ట్రిపుల్‌ ఐటీలో కలకలం రేపింది. రెండు రోజులు క్రితం పీయూసీ మెదటి సంవత్సరం చదువు తున్న విద్యార్థిని దీపిక టాయిలెట్‌‌ లో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది.

ఆ సంఘటన నుంచి తేరుకోకముందే గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న లిఖిత అనే విద్యార్థిని వసతి గృహం 4వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఆమె వయసు 17 సంవత్సరాలు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితి లో ఉన్న విద్యార్థిని మొదటగా క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించారు.

అనంతరం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లిఖిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఆమె మృతికి ట్రిపుల్‌ ఐటీ అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అర్థ రాత్రి కుక్కలు తరమడం తో నాలుగో అంతుస్తు నుంచి ఆమె పడి పోయిందంటూ హాస్టల్ వార్డెన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆమెది ఆత్మ హత్య, ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం లో స్పష్టత రావాల్సి ఉంది. ట్రిపుల్‌ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చనిపోయిన లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ‌గా గుర్తించారు. బుర్ర రాజు, రేణుక దంపతుల పెద్ద కుమార్తె లిఖిత ట్రిపుల్‌ ఐటీ లో చేరారు. గజ్వేల్‌ లో మిర్చి బండి నర్వహిస్తూ, రాజు పిల్లల ను చదివిస్తున్నారు. వారం రోజుల క్రితమే లిఖిత హాస్టల్‌ కు వెళ్లిందని, ఇంత లోనే ఇలా జరగడంతో తల్లి దండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. లిఖిత మృతి తో అక్కడి గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.