Begin typing your search above and press return to search.

భూకబ్జా ఆరోపణలు.. వైసీపీ నుంచి ఆ నేతను తొలగించారు

By:  Tupaki Desk   |   12 Aug 2020 3:00 PM GMT
భూకబ్జా ఆరోపణలు.. వైసీపీ నుంచి ఆ నేతను తొలగించారు
X
వైసీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ కోయ ప్రసాద్ రెడ్డిని బుధవారం భూసేకరణ, కబ్జా ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ప్రసాద్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. వైయస్ఆర్సీపీ క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపింది. అనంతరం కోయ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. విశాఖపట్నంకు చెందిన వైసీపీ ప్రసాద్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రసాద్ రెడ్డి వైయస్ఆర్సి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు వి విజయ్ సాయి రెడ్డి పేరును, విశాఖ నగరంలో కొన్ని భూ ఒప్పందాలను పరిష్కరించడంలో విశాఖపట్నం కలెక్టర్ పేరును దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకుల పేర్లను దుర్వినియోగం చేయడం ద్వారా భూ లావాదేవీలు, కబ్జా చేసినట్లు సమాచారం. దీంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఆయనను సస్పెండ్ చేస్తూ పార్టీ నాయకులందరికీ దీని ద్వారా స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్టైంది. పార్టీలో ఉంటూ అధికార దర్పంతో అక్రమాలు చేసే నాయకులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.