Begin typing your search above and press return to search.

ఒరేయ్.. సాయీ.. నీ అంతు చూస్తాం: టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ నేత హెచ్చ‌రిక‌లు

By:  Tupaki Desk   |   17 May 2022 8:03 AM GMT
ఒరేయ్.. సాయీ.. నీ అంతు చూస్తాం:  టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ నేత హెచ్చ‌రిక‌లు
X
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలకు దూరం కాకుంటే చంపేస్తామంటూ కాగితాలపై రాసి... కారుకు అంటించారు. కారుకు పట్టిన గతే నీకూ పడుతుందంటు రాసిన కాగితాలను సాయినాథ్‌ శర్మ కారుకు, ఇంటి గోడలకు అంటించారు. అయితే.. వీరంతా వైసీపీ నేత‌లేన‌ని శ‌ర్మ తెలిపారు.

వైఎస్సార్ జిల్లా కమలాపురంలో దుండగులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే అంతుచూస్తామంటూ కారుకు బెదిరింపులు లేఖలు అంటించారు. రాజకీయాలకు దూరం కాకుంటే చంపేస్తామంటూ కాగితాలపై రాసి.. కారుకు అంటించారు. కారుకు పట్టిన గతే నీకూ పడుతుందంటు రాసిన కాగితాలను సాయినాథ్‌ శర్మ కారుకు, ఇంటి గోడలకు అతికించారు. కమలాపురంలో రామాపురం గుడి వద్ద కారు నిలిపి ఉండగా.. దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు.

రామాపురం క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఆలయంలోనే నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటాక కారును ధ్వంసం చేసినట్లు.. తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. దాడి ఘటనపై.. సాయినాథ్‌శర్మ ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కమలాపురంలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా.. ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా సాయినాథ్‌ శర్మ తెలుగుదేశం చేపడుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి బెదిరింపులకు భయపడమని సాయినాథ్‌ శర్మ స్పష్టం చేశారు. రాజకీయాలు మానుకోవాలని లేఖలు పెట్టడం పిరికిపంద చర్య అని ఎద్దేవా చేశారు. రేపు చంద్రబాబు పర్యటన ఉండగా ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వాస్తవాలు వారే తేలుస్తారని స్పష్టం చేశారు. వైసీపీ నేత‌ల‌పైనే త‌న‌కు అనుమానం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

టీడీపీ నేత‌ల ఫైర్‌

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నాయకులు సాయినాథ్ శర్మ పై దాడిని టీడీపీ నేత‌లు ఖండించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించడం పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి బ్రాహ్మణుల పై దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయి అన్నారు. బ్రాహ్మణ సమాజం పై జగన్ రెడ్డి కక్ష కట్టారని విమర్శించారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బ్రాహ్మణ సంక్షేమం విస్మరించారని, కడప జిల్లాలో పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సొంత నిధులు తొ పేదలకు దానధర్మాలు చేసిన వ్యక్తి సాయి నాథ శర్మ గారిని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ కమలా పురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నారని అక్కసుతో సాయినాథ్ శర్మ గారిని భయపెట్టాలని చూస్తున్నారని, వైసిపి నాయకులు బెదిరింపులకు భయపఢె పరిస్థితులు బ్రాహ్మణ సమాజం కి లేదన్నారు.

చంద్రబాబు క‌మ‌లాపురం పర్యటన విజయవంతం కాకూడదని ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారని, కమలాపురం నియోజకవర్గ ప్రజలు సాయినాథ్ శర్మ గారికి అండగా నిలుస్తారని, సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో కమలాపురంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర వేస్తారు అని అన్నారు. దాడులకు దిగితే చూస్తూ ఊరుకోమని బ్రాహ్మణ సమాజం ప్రతి దాడులకు దిగుతుందని హెచ్చరించారు.