Begin typing your search above and press return to search.

లిఫ్టులో కాలిన దశలో మహిళ శవం.. భర్త చెప్పే మాటలు వింటే షాక్

By:  Tupaki Desk   |   15 July 2020 5:30 AM GMT
లిఫ్టులో కాలిన దశలో మహిళ శవం.. భర్త చెప్పే మాటలు వింటే షాక్
X
హైదరాబాద్ మహానగరంలోని చందానగర్ లో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణం షాకింగ్ గా మారింది. అపార్ట్ మెంటు లిఫ్టులో కాలిపోయిన దశలో ఉన్న మహిళ శవం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సదరు మహిళ భర్త చెబుతున్న మాటలు కొత్త అనుమానాలకు తెర తీస్తున్నాయి. చందానగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఐటీ ఐద్యోగి సంతోష్ మూడేళ్ల క్రితం స్రవంతి అనే మహిళతో వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

సంతోష్ తల్లి.. తండ్రి కూడా వారితోనే ఉంటారు. కారణాలు ఏమైనా కానీ భార్యభర్తల మధ్య గొడవలు తరచూ జరిగేవి. అత్తా కోడలికి కూడా పడేది కాదట. పెళ్లైన ఏడాదికే అంటే 2018లోనే స్రవంతి భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికి వారు కలిసే ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి కూడా భర్త.. అత్తలతో స్రవంతికి గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు. అదేరోజు అర్థరాత్రి దాటిన తర్వాత ఆమె మరణించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

కాలిన దశలో స్రవంతి మృతదేహం లిఫ్టులో ఉన్న ఉదంతం గురించి అపార్ట్ మెంటు సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగారు. ఈ ఉదంతంపై భర్తను పోలీసులు విచారించగా.. తన భార్య స్రవంతి ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పాడు. బెడ్రూంలో ఒంటికి నిప్పు అంటించుకున్న స్రవంతి ఎలాంటి శబ్దం చేయకుండానే కాలుతూనే లిఫ్టులోకి వెళ్లి మరణించిందా? అన్నదిప్పుడు సందేహంగా మారింది.

తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇంట్లో మంటలు వస్తున్నట్లుగా సెక్యురిటీ సిబ్బందికి సంతోష్ కుమార్ ఫోన్ చేసినట్లుగా తేలింది. అపార్ట్ మెంటు సెక్యురిటీ సిబ్బంది లిఫ్టులో స్రవంతి మృతదేహాన్ని చూసే వరకూ సంతోష్ కు భార్య ఆచూకీ తెలీదని చెప్పటం అనుమానాస్పదంగా మారింది. సీసీ కెమేరా ఫుటేజ్ తో పాటు.. ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు.. పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. భార్య మరణంపై భర్త చెబుతున్న మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.