Begin typing your search above and press return to search.

2025 నాటికి దేశంలో మిలియనీర్ల సంఖ్య అన్ని లక్షలకి చేరుకుంటుందా !

By:  Tupaki Desk   |   23 Jun 2021 2:30 PM GMT
2025 నాటికి దేశంలో మిలియనీర్ల సంఖ్య అన్ని లక్షలకి చేరుకుంటుందా !
X
కరోనా మహమ్మారి స్వైరవిహారం చేసిన 2020 లో కూడా దేశంలోని కుబేరులు భారీగా తమ సంపదను పెంచుకున్నారు. ముఖ్యంగా : ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, అదర్‌ పూనవాలా ... మొదలగు వారు కరోనా సమయంలో కూడా కోట్లు ఆర్జించినట్టు క్రెడిట్‌ సూసే సంస్థ నివేదిక ను బట్టి తెలుస్తుంది. 2020 లో కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్‌ లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ మాత్రం కొంతమేర తగ్గింది. కరోనా వైరస్ పరిణామాలు , అలాగే రూపాయి విలువ క్షీణించడంతో కుబేరుల సంపద విలువ 4.4 శాతం కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్‌ సూయిజ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది.

ఇండియా లో డాలర్‌ రూపేణ మిలియనీర్ల సంఖ్య 2019లో 7,64,000 కాగా, 2020లో 6,98,000కు పరిమితమైంది. వీరి మొత్తం సంపద విలువ 2019 కంటే 4.4 శాతం (594 బిలియన్‌ డాలర్లు) తగ్గి 12.833 లక్షల కోట్ల డాలర్ల (రూ.962 లక్షల కోట్లు)కు చేరింది. 2020లో భారత్‌లో ప్రతీ వయోజన వ్యక్తి సగటు విలువ 14,252 డాలర్లుగా ఉంది. 2000 నుంచి 2020 మధ్యన చూసే వార్షికంగా 8.8 శాతం పెరిగింది. అదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సగటు వృద్ధి 4.8 శాతంగానే ఉంది అని క్రెడిట్‌సూసే తెలిపింది. 50 మిలియన్‌ డాలర్లు (రూ.370 కోట్లు) అంతకు మించి సంపద కలిగిన వారు భారత్‌ లో 4,320 మంది ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ కుబేరుల్లో భారత్‌ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది. 2025 కల్లా భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 81.8 శాతం పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా 52 లక్షల మంది మిలియనీర్లు 2020లో కొత్తగా అవతరించినట్టు.. మొత్తం మిలియనీర్ల సంఖ్య 5.61 కోట్లకు చేరుకున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో మిలియనీర్ల సంఖ్య ఒక శాతానికి పైకి చేరుకున్నట్టు తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 2020లో ప్రతీ గంటకు రూ.90 కోట్ల చొప్పున తన సంపదను పెంచుకున్నట్టు ఇటీవలే హరూన్‌ ఇండియా సంపన్నుల నివేదిక గణాంకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.