Begin typing your search above and press return to search.

టీడీపీ సానుభూతిపరుడ్ని జనసేన సానుభూతిపరుడు హత్య చేశాడా?

By:  Tupaki Desk   |   1 Jun 2020 7:15 AM GMT
టీడీపీ సానుభూతిపరుడ్ని జనసేన సానుభూతిపరుడు హత్య చేశాడా?
X
పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. బెజవాడలో హాట్ టాపిక్ గా మారిన ఒక ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రెండు కోట్ల విలువైన భూమికి సంబంధించిన ఒక వివాదం సినిమాల్లో మాదిరి స్ట్రీట్ ఫైట్ కు దారి తీయటమే కాదు.. ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన పోరులో ఒకరు హత్యకు గురయ్యారు. తొలుత ఈ వ్యవహారం రెండు విద్యార్థి గ్రూపుల మధ్య జరిగినట్లుగా వార్తలు వచ్చినా? అందులో నిజం లేదంటున్నారు.

మాజీ రౌడీషీటర్లు పలువురి హస్తం ఉన్న ఈ క్రైంసీన్ కు సంబంధించి.. ఇదంతా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిదే అన్నట్లుగా ప్రచారం సాగింది. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన వాస్తవాల్ని చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కత్తులతో.. కర్రలతో జరిగిన కోట్లాటలో మరణించిన వ్యక్తి తోట సందీప్. అతగాడు టీడీపీ అభిమానిగా చెబుతున్నారు.

ఈ కోట్లాటలో పాల్గొన్న మరో వర్గం జనసేన అభిమానులుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఒకరు టీడీపీ సానుభూతిపరులైతే.. మరొకరు జనసేన సానుభూతిపరులు. ఇందులో ఏపీ అధికారపక్షానికి సంబంధించిన వారు ఎవరూ లేరని చెబుతున్నారు. మొత్తం ముప్ఫై మంది పాల్గొన్న ఈ స్ట్రీట్ ఫైట్ లో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.