Begin typing your search above and press return to search.

ఏం బతుకులు మీవి..విజయ సాయి రెడ్డి నిప్పులు

By:  Tupaki Desk   |   23 Feb 2020 9:50 AM GMT
ఏం బతుకులు మీవి..విజయ సాయి రెడ్డి నిప్పులు
X
ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో అభూత కల్పనలు రాస్తున్న పచ్చ మీడియాను, ఆ కథనాల ఆధారంగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబులను చీల్చి చెండాడాడు.

తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు.’ అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

ఇక మరో రెండు మూడు ట్వీట్ లను సైతం విజయసాయిరెడ్డి చేశారు. చంద్రబాబు, టీడీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ‘మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్నవారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసిందాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేడు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమై భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదు.’ అంటూ బాబును కడిగిపారేశారు.

ఇక నారా లోకేష్ సవాల్ పై కూడా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు.’’ అంటూ చినబాబుకు కూడా దిమ్మదిరిగేలా కడిగిపారేశారు.