Begin typing your search above and press return to search.

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు.. కేంద్ర మంత్రి జోస్యం

By:  Tupaki Desk   |   27 Jan 2023 9:27 AM GMT
ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు.. కేంద్ర మంత్రి జోస్యం
X
లేస్తే.. మ‌నిషినికాద‌న్న‌ట్టుగా ఉంది ఏపీ బీజేపీ వ్య‌వ‌హారం. ప‌ట్టుమ‌ని ప‌ది శాతం ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని.. నాయ‌కులు ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారు. అంతేకాదు.. త‌మ ధోర‌ణిలో వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్‌.. గ‌త రెండు రోజులుగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త పోయింద‌ని అంటున్న ఆయ‌న‌.. జ‌గ‌న్‌ను అధికారంలోకి తెచ్చిన ప్ర‌జ‌లే ఆయ‌న‌ను ఎప్పుడెప్పుడు దించేద్దామా అని.. అదేస‌మ‌యంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేద్దామ ని.. ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని మంత్రి వ్యాఖ్యానించారు.

దీంతో ఏపీలోనూ డబుల్ ఇంజన్ సర్కారు రానుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన తాజాగా మాట్లాడారు.

విశాఖ ఉక్కుపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిజానికి ఉక్కును అమ్మేస్తున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల దీనిలో అనుబంధ విభాగ‌మైన రైల్‌ వీల్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ కంపెనీ అమ్మేసేందుకురెండు రోజుల కింద‌ట ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దీనిని దాట వేసిన మంత్రి.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు విశాఖ ఉక్కుపై రియాక్ట్ అవుతామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కొల్పోయిందన్నారు. కేంద్రం అమలుచేస్తున్న పలు పథకాలకు స్టిక్కర్లు అంటించుకుని విస్త్భత ప్రచారం చేసుకుంటుందని ప్రజలకు అంతా తెలుసన్నారు.

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోడీ భారీగా నిధులిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఆయన పేరు చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. అయితే.. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు వ‌స్తుంద‌ని చెప్పిన కేంద్ర మంత్రి దానిని ఎలా సాకారం చేస్తార‌నేది మాత్రం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.