Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలీసులకు గాయాలు?

By:  Tupaki Desk   |   6 Dec 2019 8:45 AM GMT
ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలీసులకు గాయాలు?
X
దిశ నిందితులను ఈ ఉదయం తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. శంషాబాద్ లోని చటాన్ పల్లి వద్ద ఈ ఉదయం తెల్లవారుజామున దిశను ఎక్కడైతే చంపారో అక్కడే సీన్ రికన్ స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు నలుగురు నిందితులను తీసుకెళ్లారు. ఈ సమయంలోనే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతోపాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.

నిందితులు నలుగురు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులపై రాళ్లు రువ్వారని తెలిసింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

పారిపోతున్ననిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల రాళ్ల దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసులను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.