Begin typing your search above and press return to search.

సెల్ చార్జింగ్ పెట్టి పడుకున్నారు ..తెల్లవారేసరికి శవాలుగా మారారు !

By:  Tupaki Desk   |   11 Aug 2020 1:30 AM GMT
సెల్ చార్జింగ్ పెట్టి పడుకున్నారు ..తెల్లవారేసరికి శవాలుగా మారారు !
X
మొబైల్స్ ఈ మధ్య చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా మొబైల్ ఫోన్ కారణంగా తమిళనాడు, కరూర్ జిల్లాలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయలూరు లో చార్జింగ్ పెట్టిన ఓ సెల్ ఫోన్ పేలి ముగ్గురు చనిపోయిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సెల్ ఫోన్ కిల్ బాంబుగా మారి ముగ్గురి ప్రాణాలని తీసింది. రాత్రి సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టి కుటుంబం అంతా నిద్రపోయింది. ఫోన్ ఒక్కసారిగా పేలటంతో ఇంట్లోమంటలు సెలరేగటంతో తల్లీ…ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈప్రమాదంలో మృతులు ముత్తులక్ష్మి, అతని కొడుకులు రంజిత్, దక్షిత్ ల మరణించారు. పిల్లలు అక్కడిక్కడే చనిపోగా తల్లి ముత్తు లక్ష్మి మాత్రం ప్రాణాలతో కొట్టుకుంటూండగా హాస్పిటల్ కు తరలించగా చికిత్స తీసుకుంటూ కన్నుమూసింది.

ఈ ఘటనపై స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పేలిన ఫోన్ చైనాదని..చార్జింగ్ ఎక్కువ కావటంతో అది పేలిపోయిందని పోలీసులు తెలిపారు. రాత్రి పడుకునే సమయంలో ఫోన్ తన వద్దనే చార్జింగ్ పెట్టారని అది పేలిపోవటంతో మంటలు వ్యాపించి బెడ్ షీట్స్..రూమ్ కర్టెన్ కు మంటలు వ్యాపించాయనీ, ఫోన్ పేలుడు ధాటికి చిన్నారులిద్దరు అక్కడిక్కడే మృతి చెందారనీ..తల్లిని మాత్రం హాస్పిటల్ కు తరలించగా చికిత్స తీసుకుంటూ మృతి చెందిందని తెలిపారు.