Begin typing your search above and press return to search.

దారుణం: కరోనా ఉన్న బస్సెక్కిన ఆ ముగ్గురు!

By:  Tupaki Desk   |   5 July 2020 4:22 AM GMT
దారుణం: కరోనా ఉన్న బస్సెక్కిన ఆ ముగ్గురు!
X
మనుషుల్లో మానవత్వం లేకుండా పోతోంది. తమకు కరోనా ఉందని తెలిసినా భౌతిక దూరం పాటించకుండా జనాలకు అంటిస్తూ కొందరు తమ స్వార్థ బుద్దిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది కేసులు పెరుగుతున్న దృష్ట్యా బయటకు రావడానికే భయపడుతున్నారు.

తాజాగా కరోనా వైరస్ సోకిందని తెలిసి కూడా ముగ్గురు దుర్మార్గులు ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్లడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు లో ఈ ముగ్గురు ఆదిలాబాద్ కు వెళ్లారు.శనివారం రాత్రి 10.30 గంటలకు బస్సులో ఆదిలాబాద్ చేరుకున్నారు. నేరుగా ఆ ముగ్గురు అక్కడి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.

తమకు కరోనా సోకిందని.. ఆస్పత్రిలో చేర్చుకోవాలని అక్కడి వైద్యులను కోరారు. దీంతో వారిని చేర్చుకున్న వైద్యులు ఎలా సోకిందని.. ఎలా వచ్చారని ఆరాతీయగా బస్సులో వచ్చినట్లు తేలింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యసిబ్బంది ఆ బస్సులో ప్రయాణించిన వారు కరోనా పరీక్షలకు రావాలని కోరారు.

ఇటీవలే ఈ ముగ్గురు నిర్మల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది. కరోనా ఉందని తెలిసినా బస్సులో ప్రయాణించి వారికి సోకేలా చేసిన వీరి ముగ్గురిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.