Begin typing your search above and press return to search.
జనవరి 29 న ప్రకాశ్ రాజ్ ను చంపేస్తామంటూ లేఖ
By: Tupaki Desk | 27 Jan 2020 6:41 AM GMTఅందరూ అన్ని అంశాల మీద ఒకేలా మాట్లాడరు. ఎవరికి నచ్చిన విధానాలు వారికి ఉంటాయి. ప్రజాస్వామ్య భారతంలో ఎవరి వాదనను వారు వినిపించే వీలుంది.ఆ హక్కును కొందరు మర్చి పోతున్నట్లుగా కనిపిస్తోంది. తమకు నచ్చినట్లుగానే మాట్లాడాలన్న డిమాండ్ ప్రజాస్వామ్యం అనిపించుకోదు.ఈ చిన్న విషయాన్ని మర్చిపోతున్న వారు.. తాజాగా దారుణమైన వార్నింగ్ ను ఇచ్చారు.
ప్రముఖ నటుడు.. హిందూ అతి వాదానికి అడ్డుగా నిలుస్తూ.. తన వాదనను ప్రభావవంతంగా వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ ను తాము జనవరి 29న హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రకాశ్ రాజ్ తో పాటు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తో పాటు మరో పదమూడు మందిని హత్య చేయనున్నట్లుగా వారు వార్నింగ్ లేఖను సంధించారు.
సంఘ్ పరివార్ ను విమర్శిస్తూ వచ్చిన నిజగుణానందస్వామికి వచ్చిన లేఖలో కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ.. వారందరిని ఈ నెల 29న హత్య చేయనున్నట్లు ప్రకటించారు. కన్నడ లో ఉన్న ఈ లేఖ లో.. ధర్మ ద్రోహులు.. దేశ ద్రోహులైన విమ్మల్ని ఈ నెల 29న హతమార్చేందుకు మహుర్తం పెట్టామని పేర్కొన్నారు. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రకాశ్ రాజ్ తో పాటు నిజగుణానంద స్వామితో పాటు మరికొందరుపేర్లను కూడా అందులో పేర్కొన్నారు. ఈ లేఖ సంచలనంగా మారటమే కాదు.. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పారు. అయితే.. తమ మఠానికి అదనపు భద్రత అక్కర్లేదని స్వామి రిజెక్ట్ చేయటం గమనార్హం.
ప్రముఖ నటుడు.. హిందూ అతి వాదానికి అడ్డుగా నిలుస్తూ.. తన వాదనను ప్రభావవంతంగా వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ ను తాము జనవరి 29న హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రకాశ్ రాజ్ తో పాటు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తో పాటు మరో పదమూడు మందిని హత్య చేయనున్నట్లుగా వారు వార్నింగ్ లేఖను సంధించారు.
సంఘ్ పరివార్ ను విమర్శిస్తూ వచ్చిన నిజగుణానందస్వామికి వచ్చిన లేఖలో కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ.. వారందరిని ఈ నెల 29న హత్య చేయనున్నట్లు ప్రకటించారు. కన్నడ లో ఉన్న ఈ లేఖ లో.. ధర్మ ద్రోహులు.. దేశ ద్రోహులైన విమ్మల్ని ఈ నెల 29న హతమార్చేందుకు మహుర్తం పెట్టామని పేర్కొన్నారు. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రకాశ్ రాజ్ తో పాటు నిజగుణానంద స్వామితో పాటు మరికొందరుపేర్లను కూడా అందులో పేర్కొన్నారు. ఈ లేఖ సంచలనంగా మారటమే కాదు.. ఆశ్రమానికి అదనపు భద్రతను కల్పిస్తామని పోలీసులు చెప్పారు. అయితే.. తమ మఠానికి అదనపు భద్రత అక్కర్లేదని స్వామి రిజెక్ట్ చేయటం గమనార్హం.