Begin typing your search above and press return to search.

ఆ బాంబు పెట్టింది మేమే.. ముకేశ్​ నీకు ముందు ముందు సినిమా చూపిస్తాం..!

By:  Tupaki Desk   |   28 Feb 2021 4:30 PM GMT
ఆ బాంబు పెట్టింది మేమే.. ముకేశ్​ నీకు ముందు ముందు సినిమా చూపిస్తాం..!
X
ఇటీవల ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలోని ఓ వాహనంలో గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు ఉంచిన విషయం తెలసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఆ పేలుడు పదార్థాలను పెట్టింది మేమే నంటూ జైష్-ఉల్-హింద్ అనే సంస్థ ప్రకటించింది. 'వాహనంలో పేలుడు పదార్థం పెట్టింది మేమే. ఇది కేవలం ట్రైలర్​ మాత్రమే.. ముందు ముందు సినిమా చూపిస్తాం' అంటూ సందరు సంస్థ ఓ మెసేజ్​ను పంపించింది. ఈ మెసేజ్​ను టెలిగ్రామ్​ యాప్​లో పంపించడం గమనార్హం.

బిట్ కాయిన్ ద్వారా మాకు డబ్బులు చెల్లించాలని సదరు సంస్థ డిమాండ్​ చేసింది. అంబానీ ఇంటివద్ద అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న వాహనాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. కాగా మీరు ఆపగలిగితే మమ్మల్ని ఆపండి..అని కూడా ఈ సంస్థ పోలీసులకు సవాల్ విసిరింది.ఇటీవల అంబానీ ఇంటి సమీపంలోని ఓ వాహనంలో జిలెటెన్​ స్టిక్స్​ కనిపించాయి. ఈ వాహనాన్ని పోలీసులు గురువారం గుర్తించారు.

అయితే ఈ ఘటనకుపాల్పడింది తామేనంటూ ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది. అల్లాను నమ్మనివాళ్లకు శిక్ష తప్పదంటూ సదరు సంస్థ హెచ్చరించింది. ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు బయటపడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.