Begin typing your search above and press return to search.

రాఖీ ఏ టైమ్‌లో కట్టాలి .. 558 ఏళ్ల తర్వాత వచ్చిన మంచిరోజు !

By:  Tupaki Desk   |   3 Aug 2020 12:10 PM GMT
రాఖీ ఏ టైమ్‌లో కట్టాలి .. 558 ఏళ్ల తర్వాత వచ్చిన మంచిరోజు !
X
నేడు దేశం మొత్తం రక్షబంధన్ పండుగను ఎంతో శాస్త్రోక్తంగా, సంప్రదాయంగా జరుపుకుంటుంది. రక్షాబంధన్ హిందువుల ప్రధాన పండుగ, దీనిని శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగ సోదర సోదరిమణుల అచంచలమైన ప్రేమకు చిహ్నం. ఈ రోజున, సోదరీమణులు సోదరుడి మణికట్టు మీద రాఖీని కట్టి, సుదీర్ఘ జీవితాన్ని కోరుకుంటారు.అన్నా తమ్ముళ్లు, అక్కచెల్లలను రక్షించుకుంటామని వాగ్దానం చేస్తారు. రాఖీ కట్టిన సోదరికి ఆ తరువాత సోదరుడు బహుమతి ఇస్తాడు.

రక్షాంధన్ పవిత్ర సమయంలో రాఖీని కట్టాలి. ఈ పండుగలో పంచాంగం ప్రకారం, అనేక శుభ యోగాలు జరుగుతున్నాయి. రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం 9 నుండి 10:22 వరకు మరియు మధ్యాహ్నం 1:40 నుండి 6:37 వరకు... ఈ మధ్య సమయంలో రాఖి కట్టడానికి ఎంతో పవిత్రమైన సమయం. అలాంటి మంచి సమయంలో రాఖీని కట్టడం శుభ ఫలితాలను ఇస్తుందని, శుభప్రదమని విశ్వసిస్తారు.

ఈ రోజున రెండు ప్రత్యేక యాదృచ్చిక సంఘటనలు చోటుచేసుకున్నట్లుగా జ్యోతిష్కులు తెలుపుతున్నారు. రక్షా బంధన్ 29ఏళ్ల తర్వాత సర్వార్థ సిద్ధి మరియు ఆయుష్మాన్ దీర్ఘాయువుల శుభ కలయికగా వస్తుంది. రెండవది, 558 సంవత్సరాల తరువాత, ఆగస్టు 3 న, సావన్ నెల పౌర్ణమి నాడు, గురు, శని, రాహు మరియు కేతువుల కదలికలు తిరోగమనం సమయంలో వస్తుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, ఈ మహాసయోగం మేషం, వృషభం, కన్య, ధనుస్సు మరియు మకరం రాశులవారికి చాలా పవిత్రంగా ఉంటుంది.