Begin typing your search above and press return to search.

ఆగస్ట్ లోనే భారత్ లో థర్డ్ వేవ్! .. ఐఐటీ అధ్యయనం లో సంచలన నిజాలు!?

By:  Tupaki Desk   |   2 Aug 2021 1:30 PM GMT
ఆగస్ట్ లోనే భారత్ లో థర్డ్ వేవ్! .. ఐఐటీ అధ్యయనం లో సంచలన నిజాలు!?
X
కరోనా వైరస్ ... కరోనా వైరస్ .. ఈ మహమ్మారిని మనం మరచిపోయినా , ఆ మహమ్మారి మనల్ని మరచిపోయేలా లేదు. ఒకదాని తర్వాత, మరొకటి అంటూ వేవ్స్ మీద వేవ్స్ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మూడో వేవ్ పై సంచలన ప్రకటన చేశారు ఐఐటీ నిపుణులు.

ఐఐటి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఆగస్టు నెలలో ఇండియా లో విజృంభించే అవకాశం ఉందని, అలాగే రోజువారీ ఇన్ఫెక్షన్లు ఒక లక్ష నుండి 1.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని తేలింది. దేశంలో థర్డ్ వేవ్ లో కోవిడ్ -19 కేసుల పెరుగుదలను అంచనా వేయడానికి గణిత నమూనాను అభివృద్ధి చేసిన ఐఐటి హైదరాబాద్ మరియు ఐఐటి కాన్పూర్‌ లో మతుకుమల్లి విద్యాసాగర్ మరియు మనీంద్ర అగర్వాల్ ఈ పరిశోధన నిర్వహించారు. గతంలో, పరిశోధకులు ఏప్రిల్-మేలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన తీవ్రమైన సెకండ్ వేవ్ ను ఖచ్చితంగా అంచనా వేశారు.

ఈ నెలలోనే దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమై , పరిస్థితులు మరింత దిగజార్చవచ్చు, మూడోరి వేవ్ పిక్స్ సందర్భంలో రోజుకు 100,000 కంటే తక్కువ ఇన్ఫెక్షన్లు లేదా దాదాపు 150,000 చెత్త దృష్టాంతంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పరిశోధన సూచిస్తుంది. కేరళ మరియు మహారాష్ట్ర వంటి అధిక కరోనా కేసులు నమోదు అవుతాయని అన్నారు. ఏదేమైనా, థర్డ్ వేవ్ ,రెండవ వేవ్ కంటే బలహీనంగా ఉంటుందని భావిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. సెకండ్ వేవ్ లో రోజువారి కేసులు నాలుగు లక్షలకి పైగా నమోదు అయ్యాయి.

పరిశోధకుల సూచన ప్రకారం ప్రభుత్వం టీకాల డ్రైవ్‌ను వేగవంతం చేయాలని, కొత్త వేరియంట్‌ లు వెలువడే అవకాశం ఉన్నందున, అభివృద్ధి చెందుతున్న హాట్‌ స్పాట్‌ లను పట్టుకోవడానికి మరియు జన్యు శ్రేణిని విస్తరించడానికి నిఘా పద్ధతులను అమలు చేయాలని సూచించింది. జూలైలో, SBI రీసెర్చ్ ప్రచురించిన ఒక నివేదిక ఆగస్టు నాటికి భారతదేశంలో మూడవ తరంగాన్ని అంచనా వేసింది, ఇది సెప్టెంబర్‌ లో పిక్స్ కి చేరుకుంటుందని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ సమీరన్ పాండా కూడా ఇండియా టుడే టీవీకి చెప్పారు, ఆగస్టు చివరి నాటికి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని మరియు దేశంలో రోజుకి ఒక లక్షకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఇండియాలో కొత్తగా 40,134 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,16,95,958కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 422 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,24,773కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.13 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 36,946 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,08,57,467కి చేరింది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 4,13,718 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 14,28,984 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 46 కోట్ల 96 లక్షల 45వేల 494 టెస్టులు చేశారు. కొత్తగా 17,06,598 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 47 కోట్ల 22 లక్షల 23 వేల 639 వ్యాక్సిన్లు వేశారు.

ఇండియాలో యాక్టివ్ కేసులు 2.77 వేలు పెరిగాయి. ఇవి వరుసగా ఆరో రోజు పెరిగాయి. అలాగే... కొత్త కేసులు వరుసగా ఆరో రోజు 40 వేల కంటే ఎక్కువ వచ్చాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో కొత్త కేసులు 20.73వేలు రాగా... మహారాష్ట్రలో 6.48వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 2.29వేలు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో 157 కొత్త మరణాలు రాగా ఆ తర్వాత ఒడిశాలో 64, కేరళలో 56 వచ్చాయి. నిన్న కొత్త కేసుల్లో 51.6 శాతం కేరళలోనే వచ్చాయి. అందువల్ల ఇండియాలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 40.6 శాతం కేరళవే ఉన్నాయి. అవి మహారాష్ట్రతో పోల్చితే రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర కలిపి... 60.5 శాతం ఉన్నాయి.