Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ ప్రియుడి మోజులో పడి , కట్టుకున్న భర్తనే చంపిన భార్య !

By:  Tupaki Desk   |   20 Oct 2020 12:30 AM GMT
ఫేస్ బుక్ ప్రియుడి మోజులో పడి , కట్టుకున్న భర్తనే చంపిన భార్య !
X
సోషల్ మీడియా ద్వారా అయ్యే పరిచయాలతో ఇప్పటికే ఎన్నో కాపురాలు కూలిపోయాయి. అయినప్పటికీ కూడా వాటి ద్వారా వివాహేతర సంబంధాలు పెట్టుకుని బంగారం లాంటి కాపురాలను నాశనం చేసుకుంటున్న సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాము. అయినా ప్రజలు వాటపట్లే ఆకర్షితులవుతున్నారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది హైదరాబాద్ కు చెందిన మహిళ. ఆ విషయం తెలిసి వివాహేతర సంబంధాన్ని వదులుకోమని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చెప్పినా వినకుండా , తమ ఆనందానికి అడ్డు వస్తున్నడని , ప్రియుడితో కలిసి ఏకంగా భర్తను కాటికి పంపింది.

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట, న్యూ ఇందిరానగర్ లో నివసించే ఓ వ్యక్తి , అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళాను కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. ఆటను గగన్ పహాడ్ లోని పెట్రోల్ బంకులో పనిచేస్తుంటాడు. ఇంట్లో ఉండే అయన భార్యకి కొన్నాళ్లక్రితం ఫేస్ బుక్ లో ….పహాడీ షరీఫ్ కు చెందిన మరో వ్యక్తి తో పరిచయం అయ్యింది. ఆ పరిచయంకాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కొన్నాళ్లకు భర్త కు తెలిసిపోయింది. భార్యను మందలించాడు. అతనితో అక్రమ సంబంధం మానుకోమని చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలు మార్లు ఘర్షణ కూడా జరిగింది. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ప్రియుడు తో చెప్పి ప్లాన్ వేసింది.

ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. అక్టోబర్17, శనివారం రాత్రి బిలాల్ తో కలిసి భర్తను హత్య చేయటానికి సిధ్దమయ్యారు. భర్త ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత, ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కల్సి ఆ వ్యక్తి కు ఊపిరి ఆడకుండా దిండుతో మొఖంపై నొక్కి చంపేశారు. మరోసారి తాడుతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హత మార్చారు. ఆ తర్వాత గౌసియా అత్తగారింటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి భర్తను గొంతు నులిమాడని చెప్పింది. అత్తకుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినాసర్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ తమ స్టైల్ లో చేస్తే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.