Begin typing your search above and press return to search.

భారత్ చేరిన ఐదో బ్యాచ్ రాఫెల్ జెట్లు .. మొత్తం ఎన్ని వచ్చాయంటే !

By:  Tupaki Desk   |   22 April 2021 9:33 AM GMT
భారత్ చేరిన ఐదో బ్యాచ్ రాఫెల్ జెట్లు .. మొత్తం ఎన్ని వచ్చాయంటే !
X
రాఫెల్ జెట్ల కొనుగోలుకు సంబంధించి భారత్ 2016లో రూ. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం ఫ్రాన్స్‌ తో చేసుకుంది. అందులో భాగంగా.. గురువారం భారత్‌కు మరో నాలుగు ఫైటర్ జెట్లు చేరుకున్నాయి. దీంతో ఐదు విడతలుగా ఇప్పటివరకు ఇండియాకు 18 ఫైటర్ జెట్లు చేరుకున్నాయి. ఈ 18 ఫైటర్ జెట్లు అంబాలాలో ఏర్పాటు చేసిన మొదటి రాఫెల్ స్క్వాడ్రన్ నుంచి పనిచేయనున్నాయి. మిగతా 18 ఫైటర్ జెట్లు పశ్చిమ బెంగాల్‌లోని హసీమారాలో ఏర్పాటు చేసిన సెకండ్ స్క్వాడ్రన్‌కు ఈ ఏడాది చివరిలోగా చేరుకోనున్నాయి. భదౌరియా ఐదు రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు రాఫెల్‌ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. యుద్ధ విమానాలను సకాలంలో భారత్‌కు పంపించినందుకు ఆయన ఫ్రెంచ్‌ ఏరో స్పేస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

యుద్ధ విమానాలు నేరుగా 8వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశానికి చేరుకున్నాయి. ఈ ప్రయాణంలో.. ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక దళాలు ఈ విమానానికి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ అందించినట్లు ఐఎఎఫ్ వెల్లడించింది. ఈ నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్‌ రెండో స్క్వాడ్రన్‌ ఏర్పాటు మరింత వేగవంతం కానుంది.వీటిని పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నట్లు వాయుసేన వెల్లడించింది. మొదటి స్క్వాడ్రన్‌ను అంబాలా ఏర్‌బేస్‌లో ఏర్పాటు చేశారు. గడువులోపే రఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు పంపినందుకు ఫ్రాన్స్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు 14 రాఫెల్ యుద్ధ విమానాలు రాగా.. కొత్తగా వచ్చిన నాలుగు యుద్ధ విమానాలతో ఈ సంఖ్య 18కి చేరింది. ఇంకా 18 యుద్ధ విమానాలు భారత్‌కు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది నాటికి మొత్తం రాఫెల్ జెట్లు భారత్‌కు చేరుకోనున్నాయి. గతేడాది జూలై 29న రాఫెల్‌ మొదటి బ్యాచ్‌ జెట్లు దేశానికి చేరాయి.