Begin typing your search above and press return to search.

ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ !

By:  Tupaki Desk   |   30 Sep 2020 2:30 AM GMT
ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ !
X
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పై ఐసిఎంఆర్ నిర్వహించిన రెండో సీరో సర్వేను ఫలితాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ సర్వే లో వెల్లడైన విషయాలని బట్టి చూస్తే .. ఆగస్టు నాటికీ పదేళ్లు దాటిన ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా సోకినట్టు సిరో సర్వేలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ఐసిఎంఆర్ తెలిపింది. రానున్న సీతాకాలం, ఇతర పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే 20 కోట్లమందికి కరోనా వచ్చిపోయిందని తెలిపారు. కరోనా రికవరీ రేటులో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి 51లక్షల మందికి పైగా కోలుకున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే కరోనా మరణాల రేటు భారత్ లో తక్కువని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ లో 2.97 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డుస్థాయిలో 70 వేల 589 పాటిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 776 మంది చనిపోగా…84 వేల 877 మంది వైరస్ నుంచి కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 96 వేల 318 మంది చనిపోగా…కోలుకున్నవారి సంఖ్య 51 లక్షల వెయ్యి 397కు పెరిగింది. దేశ వ్యాప్తంగా 9 లక్షల 47 వేల 576 యాక్టివ్ కేసులున్నాయని బులిటెన్ లో తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. రోగుల రికవరీ రేటు 83.01 గా నమోదైందని ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 15.42 గా ఉండగా…ఇప్పటి వరకు 7 కోట్ల 31 లక్షల 10 వేల 41 టెస్టులు చేసినట్టు బులిటెన్ విడుదల చేసింది.