Begin typing your search above and press return to search.

ఒక్క స్తంభం కూలితే ప్రపంచం నాశనం అవుతుందా ?

By:  Tupaki Desk   |   2 Jun 2020 5:50 AM GMT
ఒక్క స్తంభం కూలితే ప్రపంచం నాశనం అవుతుందా ?
X
ఈ కలియుగం ఎప్పుడో ఒకప్పుడు అంతం అవ్వడం అనేది జగమెరిగిన సత్యం. ఈ కలియుగాంతానికి .. శివుడికి ఓ సంబంధం ఉంది. అసలు శివుడికి, కలియుగాంతానికి ఉన్న సంబంధం ఏమిటి ..అని కొందరు అనుకుంటూ ఉండవచ్చు. ఈ సంబంధం గురించి తెలియాలి అంటే మనం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని హరిచంద్ర కోటకి వెళ్లాల్సిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత పూరితమైన చరిత్ర కలిగిన కోట. ఈ కోటలోనే ఉంది కలియుగాంతానికి సంబంధం ఉన్న ఆ శివుడి ఆలయం.

ఈ కోటలోని ఒక చిన్న గృహాల్లో 5 అడుగుల ఒక శివలింగం ఉంది. ఆ లింగం ఒక పెద్ద బండరాయి కింద ఉంది. ఆ శివలింగాన్ని ప్రతిష్టించేటప్పుడు ..ఆ బండరాయి శివలింగం మీద పడకుండా నాలుగు వైపులా నాలుగు స్థంబాలు చెక్కారు. ఈ స్థంబాలు యుగాంతానికి ప్రతీకలు అని అంటారు. ఒక్కొక్క స్థంభం ఒక్కో యుగాంతానికి ప్రతీక అని భక్తుల నమ్మకం. ఇప్పటికే ఈ నాలుగు స్థంబాలలో ఒక్కొక్క యుగానికి ప్రతీకగా ..ఒక్కో స్థంభం విరిగిపోయాయి ..ఇప్పుడు ఒకే ఒక స్థంభం మిగిలివుంది. ఆ స్థంభం కూడా కలియుగాంతంలో విరిగిపోతుంది ఆలా ఆ స్థంభం కూలిపోయినప్పుడు కలియుగం అంతం అవుతుంది అని భక్తుల నమ్మకం.

కొంతమంది వాదన ప్రకారం కృతయుగంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు అంటే .. మరికొందరు ఆ హరిచంద్ర కోటని మొదటి సారి నిర్మించి , పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు 4 వ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని కట్టి ఉంటారు అని అంటున్నారు. ఐతే, ఈ ఆలయం ఎవరు, ఎప్పుడు నిర్మించారనే విషయం మాత్రం కచ్చితంగా ఎవరికీ తెలియదు. ఇకపోతే ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఆలయంలో ఎప్పుడు ఐదు అడుగుల మేర కోనేటిలో చల్లని నీరు ఉంటుంది. ఈ నీరు ఆ కోనేటిలోకి ఆలయ గోడల్లో నుండి వస్తుంది. ఐతే , ఈ ఆలయంలో జరిగే వింత ఏమిటి అంటే ..ఒక్క వర్షా కాలంలో తప్ప ..ఆ నీరు మిగిలిన అన్ని కాలాల్లో వస్తుంది. అక్కడ వర్షాకాలంలో ఒక్క చుక్క నీరు కూడా కనిపించదు. ఎండాకాలంలో ఎంత ఎండ ఉన్నా కూడా నీరు చల్లగానే ఉంటాయి. ఈ వింతని చూడటానికి ఎంతోమంది ఇతరదేశాల నుండి కూడా వస్తుంటారు.