Begin typing your search above and press return to search.

30 ఏళ్ల మ‌హిళ‌-ఐదుగురు 60 ఏళ్ల వృద్ధులు.. సామూహిక‌ సెక్స్ మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందంటే

By:  Tupaki Desk   |   29 Nov 2022 11:30 AM GMT
30 ఏళ్ల మ‌హిళ‌-ఐదుగురు 60 ఏళ్ల వృద్ధులు.. సామూహిక‌ సెక్స్ మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందంటే
X
ఓ వితంతువు ఐదుగురు వృద్ధులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరంతా సామూహికంగా సెక్స్‌లో పాల్గొని ఎంజాయ్ చేసేవారు. అయితే, అందులో ఒక వృద్ధుడిని మిగతా నలుగురితో కలిసి హత్య చేసింది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే చాలా ఆశ్చ‌ర్య‌కంగా ఉంది. ఈ ఘటన బిహార్లో జరిగింది.

అస‌లు విష‌యం..బిహార్ లోని నలందా జిల్లాలో లో దారుణం జరిగింది. పిను దేవీ(30) అనే వితంతువు టీ దుకాణం నిర్వహి స్తుండేది. ఈమె భ‌ర్త క‌రోనా స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేప‌థ్యంలో కృష్ణనందన్ ప్రసాద్ (75), సూర్యమణి కుమార్ (60), వాసుదేవ్ పాశ్వాన్ (63), లోహా సింగ్ (62) అనే వ్యక్తులు ఆమె టీ దుకాణానికి వచ్చే వారు.

అలా వీరు నలుగురు పిను దేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అంద‌రూ క‌లిసి సామూహిక సెక్స్‌లో ఎంజాయ్ కూడా చేశారు.

కొన్నాళ్ల తర్వాత తృపిత్ శర్మ (75) అనే మ‌రో వృద్ధుడు టీ దుకాణానికి వచ్చి.. పిను దేవితో సన్నిహితంగా ఉండేవాడు. అలా వీరిమధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మిగతా నలుగురు ప్రియులకు తెలిసింది. తృపిత్ శర్మ రావడం మిగతా నలుగురికి నచ్చలేదు. త్రిపిత్ శర్మతో సంబంధం తెంచుకోమని పినూ దేవిని హెచ్చరించారు.

దీనిపై శ‌ర్మ‌తో గొడ‌వ జ‌రిగింది. ''న‌న్ను కాదంటే.. మిగిలిన వారి విష‌యాల‌ను బ‌హిరంగ ప‌రుస్తా' అని హెచ్చ‌రించాడు. దీంతో తృపిత్ శర్మను హత్య చేసేందుకు పిను దేవి.. తన నలుగురు ప్రియులతో కలిసి ప్లాన్ చేసింది. ఇంటికి రమ్మని తృపిత్ను పిలిచింది. పథకం ప్రకారం తన నలుగురు ప్రియులు రాళ్లతో తృపిత్పై దాడి చేసి హతమార్చారు. అనంతరం టాయిలెట్ ట్యాంక్లో పడేశారు.

అక్టోబరు 21న మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసును ఛేదించి.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ కాల్స్ ఆధారంగానే నిందితులను గుర్తించామని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.