Begin typing your search above and press return to search.

ఆంటీలే టార్గెట్.. మన్మథుడి వేషాలు!

By:  Tupaki Desk   |   1 Jun 2020 12:30 AM GMT
ఆంటీలే టార్గెట్.. మన్మథుడి వేషాలు!
X
యుక్త వయసు దాటిన మహిళలు, కొత్తగా పెళ్లైన ఆంటీలే వాడి టార్గెట్. వారి చిత్రాలను తీసి మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వాడుకోవడం వాడి పడి. సరిగ్గా మీసాలు కూడా రాని ఈ నవ మన్మథుడి రాసలీలల వ్యవహారానికి చెక్ పడింది. పోలీసుల చేతికి చిక్కిన వీడిని విచారిస్తే వీడి మాయలో పడిన ఆంటీల సంఖ్య బోలెడు ఉంది. దీంతో ఈ కేసు సీబీసీఐడీకి అప్పగించి... వీడి ఆగడాలపై ఫిర్యాదుల కోసం ఏకంగా ప్రత్యేక ఫోన్ నంబర్ కేటాయించడం విశేషంగా మారింది.

రామనాథపురం పరమకుడికి చెందిన ఓ ఉద్యోగి తాజాగా తన భార్య ఫొటోలు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. రూ.20వేలు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడుతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 20వేలు ఇస్తున్నట్టు ఉద్యోగితో పంపించారు. వాటిని తీసుకునేందుకు వచ్చిన ఆ మన్మథుడు అడ్డంగా బుక్కయ్యాడు.

విచారించగా.. అతడు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న యువకుడు. నిండా 20 ఏళ్లు కూడా లేని ఈ విద్యార్థిని ఉలగనాథపురానికి చెందిన వ్యక్తిగా తేల్చారు. సరిగ్గా మీసాలు కూడా రాని వీడు ఫేస్ బుక్ - టిక్ టాక్ - వాట్సప్ ల ద్వారా యుక్త వయసు దాటిన వారు - కొత్తగా పెళ్లైన మహిళల్ని టార్గెట్ చేస్తుంటాడని తేలింది. వారితో పరిచయాలు పెంచుకొని వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించి లొంగ దీసుకుంటాడు. లైంగికంగా వాడుకుంటాడు. కొందరి వద్ద నగదు కూడా దోచుకున్నట్టు విచారణలో తేలింది.

అతడి సెల్ ఫోన్ నిండా మార్ఫింగ్ చేసిన ఫొటోలే కనిపించాయి. బెదిరింపు మెసేజ్ లున్నాయి. దీంతో ఇంతమంది ఆంటీలు, యువతులకు ఇతడు వలవేశాడని తెలిసి బాధితులు ఎక్కువగా ఉండడంతో కేసును సీబీసీఐడికి అప్పగించారు. ఓ సెల్ నంబర్ ఇచ్చి వీడిపై బాధితులు ఫిర్యాదు చేయాలని కోరారు.