Begin typing your search above and press return to search.

తాలిబన్ల దుశ్చర్య....18 మంది జవాన్లు మృతి !

By:  Tupaki Desk   |   18 Jun 2020 11:10 AM GMT
తాలిబన్ల దుశ్చర్య....18 మంది జవాన్లు మృతి !
X
అఫ్గనిస్థాన్ ‌లో తాలిబన్ల మరోసారి దుశ్చర్యకు తెగబడ్డారు. అఫ్గన్ ఉత్తర ప్రాంతంలో రెండు చోట్ల దాడులకు తెగబడి 18 మంది సైనికుల ప్రాణాలని బలి తీసుకుంది. బాగ్లాన్ రాజధాని పుల్ ఇ ఖుమ్రిల్ ‌లోని సైనిక స్థావరంపై మెరుపు దాడికి పాల్పడిన ఘటనలో ఏడుగురు సైనికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అయితే, ఈ దాడిలో తాలిబన్లు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. జౌజాన్ ప్రావిన్సుల్లో చెక్‌ పోస్ట్ వద్ద తాలిబన్లు జరిపిన దాడిలో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆ ప్రావిన్సుల గవర్నర్ అధికార ప్రతినిది మరూఫ్ అజార్ ఏఎఫ్‌పీ న్యూస్‌కు వెల్లడించారు.

ఈ దాడిని తిప్పికొట్టిన సైన్యం ఐదుగురు తాలిబన్లను హతమార్చినట్టు తెలిపారు. ఈ దాడిని అఫ్గన్ రక్షణ శాఖ సైతం ధ్రువీకరించింది. తాలిబన్ల దాడిలో ఆరుగురు సైనికులు చనిపోయినట్టు వెల్లడించింది. అయితే, ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. అఫ్గన్‌ లో శాంతి స్థాపనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సమక్షంలో అవగాహన ఒప్పందంపై ప్రభుత్వం, తాలిబన్లు సంతకాలు చేసినా హింస మాత్రం ఆగడంలేదు. దేశవ్యాప్తంగా తాలిబన్లు జరిపిన 220 దాడుల్లో 422 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం, గాయపడినట్టు ఇటీవల అఫ్గన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని తాలిబన్లు ప్రకటించారు.

కానీ, తాలి బన్ ఖైదీల విడుదలే లక్ష్యంగా.. ఆఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య జరుగుతున్న చర్చలకు బ్రేక్ పడింది. దీంతో ఆఫ్ఘానిస్థాన్ ‌లో శాంతి నెలకొల్పాలనుకున్న అమెరికా ప్రయత్నాలకు విఘాతం కలిగింది. పెద్ద పెద్ద దాడులలో పాల్గొన్న 15 సీనియర్ కామెండర్లను విడుదల చేయాలని తాలిబన్లు ప్రభుత్వాన్ని కోరడంతోటే ఈ సమస్య ఎదురయ్యింది. ఈ కామెండర్లను విడుదల చేయాలని కోరడం.. తాలిబన్ల మొండి పట్టుదలకి నిదర్శనమని ఇండిపెండెంట్ డైరెక్టరేట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అధిపతి మాటిన్ బెక్ చెప్పారు.