Begin typing your search above and press return to search.

శ్రీవారి భక్తులకు షాక్ .. టీటీడీ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   22 Sep 2021 11:30 AM GMT
శ్రీవారి భక్తులకు షాక్ .. టీటీడీ సంచలన నిర్ణయం
X
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇక పై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌ లైన్‌ లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుంపులుగా నిలబడటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉందని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. కొండకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి దర్శనం టోకెన్లను క్రమంగా పెంచుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు నియంత్రణలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. రెండు వారాల చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేయగా.. ఇటీవలే ఇతర ప్రాంతాల వారిని కూడా ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు.