Begin typing your search above and press return to search.

అనుమానంతో ప్రియురాలిని హత్య చేసి.. తానూ పురుగుల మందు తాగి..అనాథలైన పిల్లలు

By:  Tupaki Desk   |   6 Aug 2020 9:50 AM GMT
అనుమానంతో ప్రియురాలిని హత్య చేసి.. తానూ పురుగుల మందు తాగి..అనాథలైన పిల్లలు
X
పెళ్లయి పిల్లలున్న ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి మూడేళ్లపాటు తన సంబంధాన్ని నెరిపాడు. ఆ మహిళ తనతో పాటు మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకొని గొంతు నులిమి చంపేశాడు. తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

తాడేపల్లె గూడెంకు చెందిన రామలక్ష్మి భర్తతో తలెత్తిన విభేదాల కారణంగా అతడి నుంచి విడిపోయి పిల్లలతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో ఉంటోంది. అక్కడే ఆమెకి సూర్యరావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. మూడేళ్ల పాటు తన సంబంధాన్ని కొనసాగించిన సూర్యారావు, ఆ తర్వాత రామలక్ష్మి మరొకరితో కూడా సన్నిహితంగా మెలుగుతోందని అనుమానించాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు రామలక్ష్మిని సమీప అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరొకరితో సంబంధం కొనసాగిస్తున్నావంటూ ఆమెతో గొడవ పడ్డాడు.గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. తను కూడా చనిపోవాలని పురుగులమందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. అటవీ ప్రాంతంలో వాళ్లను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని పురుగుల మందు తాగిన సూర్యారావుని ఆసుపత్రిలో చేర్పించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. పెళ్లయి పిల్లలు ఉన్న మహిళ భర్తను వదిలేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోగా, ఆ వ్యక్తి అనుమానంతో ఆమెను హత్య చేయడంతో పిల్లలు అనాథ లుగా మిగిలిపోయారు.