Begin typing your search above and press return to search.

ఢిల్లీ కాలుష్యంపై ఆ రాష్ట్రలకి సుప్రీం ఆదేశాలు

By:  Tupaki Desk   |   30 Nov 2021 1:30 AM GMT
ఢిల్లీ కాలుష్యంపై ఆ రాష్ట్రలకి సుప్రీం ఆదేశాలు
X
భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతుండటం పై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలన్నిటినీ తక్షణమే పాటించాలని ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటించడానికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని, తదుపరి విచారణ గురువారం జరుగుతుందని వెల్లడించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటం పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని తెలిపింది. తాజాగా గాలి కాలుష్యం స్థాయి 419 అని, ఇది రోజు రోజుకూ పెరుగుతోందని తెలిపింది. మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగో దశ విస్తరణ కోసం చెట్లను తొలగించడానికి ముందు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్‌ నుంచి అనుమతి పొందాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌ సీ )ని ఆదేశించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల్లో, మొక్కలు నాటడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించి, 12 వారాల్లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. ఓవైపు కాలుష్యం పెరుగుతుండగా, కొత్తగా కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ బయటపడటం మరో సమస్య అని తెలిపింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో ఉంది. ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 370 వద్ద ఉంది.

కాలుష్య నియంత్రణపై ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటిస్తున్నట్లు కేంద్రం చెప్తున్నప్పటికీ, ఫలితం శూన్యంగా కనిపిస్తోందని చెప్పారు. ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలన్నిటినీ తక్షణమే పాటించాలని ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటించడానికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని, తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది.