Begin typing your search above and press return to search.

మాయదారి పబ్ జీ రిటర్న్.. ఇక రిలయెన్స్​ చేతుల్లోకి!

By:  Tupaki Desk   |   22 Sep 2020 2:30 AM GMT
మాయదారి పబ్ జీ రిటర్న్.. ఇక రిలయెన్స్​ చేతుల్లోకి!
X
ఇటీవల కేంద్రప్రభుత్వం పబ్​-జీ గేమ్​ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ గేమ్​ను ఇష్టపడేవారంతా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. అయితే పబ్​జీ గేమ్​ను రిలయెన్స్​ సంస్థ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. దీంతో పబ్​జీ గేమ్​ మళ్లీ భారత్​లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. పబ్​జీ గేమ్​ను దక్షిణకొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియోస్ సంస్థ రూపొందించింది. ఇండియాలో ఈ కంపెనీపై నిషేధం విధించడంతో చైనా కంపెనీ నుంచి బ్లూ హోల్ స్టూడియోస్ ఫ్రాంచైజీని ఉపసంహరించుకున్నది. ఈ క్రమంలోనే భారత్‌లో తిరిగి ప్రారంభంపై రిలయన్స్ జియోతో చర్చలు జరుపుతోంది.

ఇండియాలో ఈ గేమ్​పై నిషేధించ విధించడంతో దక్షిణ కొరియాకు చెందిన ప్రధాన సంస్థ పబ్జీ కార్పొరేషన్.. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల భారత్​ భద్రతా పరమైన కారణాల దృష్ట్యా పలు చైనా యాప్​లను నిషేధించింది. అందులో భాగంగానే పబ్​జీని కూడా నిషేధించింది. ఈ క్రమంలోనే బ్లూ హోల్ స్టూడియోస్ నుంచి వచ్చిన బ్లాగ్‌లో.. భారతదేశంలో గేమ్ పంపిణీ కోసం రిలయన్స్ జియోతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పింది. డీల్ ఇప్పుడే ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ గేమ్​ భారత్​లోకి రానున్నట్టు సమాచారం. పబ్ జీకి బానిసలై ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయారు. దానిని ప్రభుత్వం నిషేధించగానే సంతోషించారు. ఆ మాయదారి మళ్లీ వచ్చేస్తుండటంతో తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.