Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఘోరం.. సోదరుడితో కలిసి లవ్వర్ గొంతు కోసిన కసాయి

By:  Tupaki Desk   |   19 Oct 2020 7:15 AM GMT
హైదరాబాద్ లో ఘోరం.. సోదరుడితో కలిసి లవ్వర్ గొంతు కోసిన కసాయి
X
ప్రేమ అంటూ వెంట పడ్డాడు. ఆమె నమ్మింది. కలిసి తిరిగిన వారు.. ప్రేమ తర్వాత పెళ్లే కదా? చేసుకుందామని అడిగేసరికి తప్పించుకు తిరగటం షురూ చేశాడు. అప్పటివరకు తియ్యటి కబుర్లు చెప్పిన అతడు.. పత్తా లేకుండా పోయాడు. దీంతో షాక్ కు గురైన లా విద్యార్థిని.. అతడి ఇంటికే నేరుగా వెళ్లి నిలదీసింది. అంతే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ లో పెను సంచలనంగా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కరస్ గుత్తి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం హైదరాబాద్ కు తరలివచ్చింది. వారంతా ఆసిఫ్ నగర్ లో ఉంటున్నారు. వారి కుమార్తె 24 ఏళ్ల యువతీ ఎల్ ఎల్ బీ చదువుతున్నారు. జంతుప్రేమికురాలైన ఆమె.. కొన్ని నెలల క్రితం మదీనాకు చెందిన సయ్యద్ తో పరియమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య సానిహిత్యం పెరిగిన నేపథ్యంలో.. పెళ్లి ప్రస్తావన వచ్చింది.

అప్పటి నుంచి సయ్యద్ అడ్రస్ లేకుండా పోతున్నాడు. ఆమె ఎంత కలిసే ప్రయత్నం చేసినా.. కలవటం లేదు. దీంతో.. శనివారం రాత్రి సయ్యద్ ఇంటికి వెళ్లింది ఆ యువతీ. పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.దీంతో.. ఇరు కుటుంబాల వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం.. ఆమెను మంచి మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లిన సయ్యద్.. తన సోదరుడు ఇంటికి వచ్చిన తర్వాత విషయం చెప్పాడు. వారిద్దరు కలిసి యువతీ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం పోలీసుల తెలీయటంతో రంగంలోకి దిగారు. ప్రేమించిన అమ్మాయిని ఇంత దారుణంగా హతమార్చటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.