Begin typing your search above and press return to search.

విజయవాడ ప్రేమోన్మాది కేసులో అన్ని ట్విస్టులే .. నిలకడగా నిందుతుడి ఆరోగ్యం !

By:  Tupaki Desk   |   19 Oct 2020 8:10 AM GMT
విజయవాడ ప్రేమోన్మాది కేసులో అన్ని ట్విస్టులే  .. నిలకడగా నిందుతుడి ఆరోగ్యం !
X
విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో బంగారు భవిష్యత్ ఉన్న ఓ బిటెక్ విద్యార్థిని , మధ్యలోనే తనువూ చాలించేసింది. ఈ యువతి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. నిందుతడు నాగేంద్రనే ఆ యువతిని పక్కా ప్లాన్ చేసి హత్య చేసినట్లు గుర్తించారు. యువతితో దిగిన ఫొటో నిజం కాదని, అది మార్ఫింగ్ ఫొటో అని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడే నిద్ర లేచిన యువతి గదిలోకి చాకచక్యంగా ప్రవేశించి ఆమెపై నాగేంద్ర దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే , నిందుతుడు మాత్రం హాస్పిటల్ లో మేము ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని ఓ వీడియోను లీక్ చేశాడు. తమకు వివాహమైనట్లు కూడా ఓ ఫొటోను బయటపెట్టాడు. అయితే, ఆ రెండు విషయాలను దివ్య కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

విజయవాడలోని క్రీస్తురాజపురంలోని తన ఇంట్లోనే యువతి ఈ నెల 15వ తేదీన హత్యకు గురైన సంగతి తెలిసిందే. అదే సమయంలో గదిలో నాగేంద్ర రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో దివ్యను ఆమె తల్లి కుసుమ టిఫిన్ చేయడం కోసం లేపింది. అయితే, కాసేపటి తర్వాత చేస్తానని చెప్పి దివ్య నిద్రలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వాలంటీర్ రావడంతో కుసుమ కిందికి వెళ్లింది. అప్పటికే నాగేంద్ర వెనుక వైపు నుంచి దివ్య గదిలోకి ప్రవేశించి లోపలి నుంచి గడియ పెట్టాడు. పక్క గదికి కూడా గడియ వేశాడు. కుసుమ తిరిగి మేడకు వెళ్లి చూడగా బయట అబ్బాయి చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి తలుపు కొట్టింది. కానీ తలుపు ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. తలుపు పగులగొట్టి చూడగా యువతి రక్తం మడుగులో కనిపించింది. నాగేంద్ర చిన్నచిన్న గాయాలతో ఓ మూలన పడి ఉన్నాడు. ఆటోలో ఆస్పత్రికి తరలించే సమయంలో నాగేంద్ర గొంతుపై గాయం చేసుకున్నాడు.

యువతి, ఉన్న గదిలో ఫ్యాన్ కు బెడ్ షీట్ వేలాడుతూ కనిపించింది. ఈ వ్యవహారాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే .. ఓ పథకం ప్రకారమే చంపాలనే ఉద్దేశంతోనే నాగేంద్ర వచ్చినట్లు అర్థమవుతుందని అంటున్నారు. నాగేంద్ర స్టీల్ చాకుతో యువతి మెడపై తొలుత పొడిచి, శరీరంపై ఇష్టానుసారం పొడిచినట్లు అనుమానిస్తున్నారు. అమ్మాయి శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్న విషయాన్ని ఆమె తండ్రి జోసెఫ్ తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కట్టుకథలు అల్లి వీడియోలను, ఫొటోలను నాగేంద్ర వదిలినట్లు భావిస్తున్నారు. ఇక యువతి సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన ఆవేదన నాగేంద్ర గురించేనని అనుమానిస్తున్నారు. తనకు దివ్య దూరమైన తర్వాత ఆమె స్నేహితురాళ్లను వాడుకుని నకిలీ ఖాతా సృష్టించి వేధింపులు సాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి ఫోన్ ను విశ్లేషిస్తున్న సైబర్ క్రైమ్ విభాగం నిపుణులు ఇన్ స్టాగ్రామ్ ఖాతలో ఆమె యాక్సెస్ ఉన్న వాళ్ల జాబితాను తయారు చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఇదిలా ఉంటే ,ఈ హత్య కేసు ప్రధాన నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అతడి కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు.. పోస్టు ఆపరేటివ్‌ ఐసీయూ వార్డుకు మార్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్‌ఎంఓ సతీష్‌ తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని సతీష్‌ వెల్లడించారు. ప్రస్తుతం బీపీ లెవల్స్, పల్స్ బాగానే ఉన్నాయన్నారు. అయితే రెండు రోజులు గడిచిన తరువాత మాత్రమే నాగేంద్రబాబు పరిస్థితి చెప్పగలమని వైద్యులు చెప్తున్నారు.