Begin typing your search above and press return to search.

చెన్నైలో ఆసుప‌త్రిలో దారుణం, ఫోన్ , డ‌బ్బుకోసం క‌రోనా పేషేంట్ ను .. !

By:  Tupaki Desk   |   17 Jun 2021 7:30 AM GMT
చెన్నైలో ఆసుప‌త్రిలో దారుణం, ఫోన్ , డ‌బ్బుకోసం క‌రోనా పేషేంట్ ను .. !
X
త‌మిళ‌నాడులో క‌రోనా వైరస్ మ‌హ‌మ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా అక్కడ వైరస్ అదుపులోకి రాలేదు. రాష్ట్రంలో ప్ర‌తిరోజూ 10వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. చెన్నైలోని ఆసుప‌త్రులు దాదాపుగా క‌రోనా రోగుల‌తో నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే, చెన్నైలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. పేషెంట్ వద్ద ఉన్న నగదు, సెల్‌ ఫోన్‌ పై కన్ను వేసిన ఆస్పత్రి ఉద్యోగిణి.. పేషెంట్‌ ను అత్యంత కిరాతకంగా చంపేసింది. అయితే, తన భార్య కనిపించడం లేదంటూ భర్త చేసిన ఫిర్యాదు అసలు విషయం అంతా బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే .. చెన్నైకి చెందిన సునితకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆమె చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సునీత భర్త మౌళి అమెకు అవసరమైనవి అందిస్తూ వచ్చాడు. అయితే, సునీత వద్ద కొంత నగదు, సెల్ ఫోన్ ఉన్నాయి. వాటిని కన్ను వేసింది ఆసుప్రతిలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగిని రతీదేవి. ఎలాగైనా వాటిని కాజేయాలని ప్లాన్ వేసుకున్న రతీదేవి.. మే 23వ తేదీన రతీదేవి, కోవిడ్ పేషెంట్ సునీతను అత్యంత దారుణంగా చంపేసింది. ఆమె వద్ద ఉన్న నగదు, సెల్‌ ఫోన్ తీసుకుని, సునీత మృతదేహాన్ని ఆస్పత్రి వెనుకవైపు పడేసింది. అయితే, సునీత భర్త మౌళి తన భార్య ఆస్పత్రిలో కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి మొత్తం గాలించారు. అయినా ఎక్కడా కనిపిపంచలేదు. చివరకు ఇవాళ ఆస్పత్రి వెనుకవైపు సునీత మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసింది రతీదేవి అని తేల్చారు. రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించింది. ఈ కేసులో నిందితురాలు ర‌తీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచార‌ణ చేస్తున్నారు.