Begin typing your search above and press return to search.

కరోనా దోపిడీ: హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు షాక్

By:  Tupaki Desk   |   26 May 2022 12:30 AM GMT
కరోనా దోపిడీ: హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు షాక్
X
కరోనా మహమ్మారి వేళ రోగులను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పిండేసిన హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రులకు గట్టి షాక్ తగిలింది. ఇన్నాల్లకు వాటి పాపం పండింది. కరోనా వచ్చిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రి నుంచి చిన్న ఆస్పత్రులు కూడా తమ దగ్గరకు చికిత్స కోసం వచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశాయని ఆరోపణలు అనేకం వినిపించాయి.

తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని ఆస్పత్రులు అధిక చార్జీలు వసూలు చేశారనే ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మొత్తం 44 ఆస్పత్రులకు పేషంట్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.

ఇందులో భాగంగా కరోనా పేరుతో రోగుల నుంచి దోపిడీ చేసిన రూ.1.61 కోట్ల మొత్తం రోగుల కుటుంబాలకు తిరిగి ఇచ్చారు. ఇందులో భాగంగా జూన్ 22, 2021 నాటికి రోగుల కుటుంబాలకు రూ.1.61,22,484 తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని నాలుగు ఆస్పత్రులు ఒక్కొక్కటి రూ.10లక్షలకు పైగా తిరిగి ఇవ్వగా.. కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి రోగి కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 27.41 లక్షలు తిరిగి ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది.

ఇక హైదరాబాద్ లోని కూకట్ పల్లి, ఎల్బీనగర్, సచివాలయం, హైటెక్ సిటీ, బషీర్ బాగ్, గచ్చిబౌలి, నాగోల్ ఇలా అనేక ప్రాంతాల్లోని అనేక ఆస్పత్రులు తాము కరోనా సమయంలో వసూలు చేసిన డబ్బులను రోగి కుటుంబాలకు తిరిగి ఇచ్చారు.

నగరంలోని పలు ఆస్పత్రులు ఎక్కువ మొత్తాన్ని వాపసు ఇచ్చినప్పటికీ ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించిన రోగులకు డబ్బును తిరిగి ఇచ్చే ఆస్పత్రుల జాబితాలో మొత్తం 33 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్లు ఆర్టీఐ వెల్లడించింది.