Begin typing your search above and press return to search.

చీక‌టి రూమ్‌ లో బెల్టుతో చిత‌క్కొడ‌తా..అధికారుల‌పై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   25 May 2020 4:30 PM GMT
చీక‌టి రూమ్‌ లో బెల్టుతో చిత‌క్కొడ‌తా..అధికారుల‌పై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్య‌లు
X
మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు విధించిన క్వారంటైన్ కేంద్రంలో సౌక‌ర్యాలు స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో ఓ కేంద్ర‌మంత్రికి తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో ఆమె తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ క‌నిపించిన అధికారుల‌పై విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నారా?.. రూమ్‌లో పెట్టి బెల్టుతో చితక్కొడతానంటూ ఆ మంత్రి ఆగ్ర‌హం తెప్పించారు. ఆమెనే కేంద్ర కేంద్ర గిరిజన ‌శాఖ స‌హాయ మంత్రి రేణుకా సింగ్‌.

చ‌త్తీస్‌ఘ‌డ్‌ లోని బ‌ల‌రాంపూర్‌ ఉన్న క్వారెంటైన్ కేంద్రాన్ని మంత్రి రేణుకా సింగ్‌ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆ కేంద్రంలో సౌక‌ర్యాలు స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో అధికారుల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దాదాగిరి నహీ చాలేగి అంటూ పిచ్చిపిచ్చి వేషాలు వేసే వారిని ఎలా ట్రీట్ చేయాలో త‌న‌కు తెలుసని.. రూముల్లోకి తీసుకువెళ్లి బెల్టుతో కొట్ట‌డం త‌న‌కూ తెలుసు అని ఊగిపోయారు.

ఆమె ఆగ్ర‌హం వెనుక ఒక కార‌ణం ఉంది. అదేంటంటే.. బ‌ల‌రాంపూర్ క్వారెంటైన్ కేంద్రం‌లో ఉన్న దిలీప్ గుప్తా వ‌స‌త‌ులు స‌రిగా లేవ‌ని ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌లైంది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసేందుకు త‌న‌పై అధికారులు దాడి చేసిన‌ట్లు సదరు అధికారి వాపోయారు. దీంతో ఆమె వెంట‌నే క్వారంటైన్ కేంద్రం స్పంద‌ర్శించి పై విధంగా స్పందించారు. త‌మ‌ ప్రభుత్వం (బీజేపీ) అధికారంలో లేద‌ని అనుకుంటున్నారా? మేం 15 ఏళ్లు పాలించాం.. వైర‌స్‌తో పోరాడేందుకు కేంద్రం దగ్గర నిధులు పుష్కలంగా ఉన్నాయి. అవసరానికి కావాల్సిన అన్ని నిధులు ఉన్నాయని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విధంగా అధికారుల‌ను బెదిరించ‌డంపై తీవ్ర దుమారం రేపుతోంది. ఒక మ‌హిళ‌.. ప్ర‌జాప్ర‌తినిధి అయి ఉండి కూడా అధికారుల‌పై విరుచుకుప‌డ‌డం స‌రికాద‌ని చెబుతున్నారు.