Begin typing your search above and press return to search.

సచిన్ పైలట్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఎందరంటే?

By:  Tupaki Desk   |   14 July 2020 10:30 AM GMT
సచిన్ పైలట్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఎందరంటే?
X
రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ ను కూల్చడానికి తిరుగుబాటు చేసిన యువనేత సచిన్ పైలట్ తన బలాన్ని చూపించాడు. అతడి వెంట 16మంది ఓ రిసార్ట్ లో కూర్చొని ఉండగా తీసిన ఫొటో, మీడియా చక్కర్లు కొడుతోంది. సచిన్ పైలట్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి విడుదలైన ఈ 10 సెకన్ల వీడియోలో 10మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. వీరంతా గురుగ్రామ్ లోని మానెసర్ హోటల్ లో క్యాంప్ నిర్వహిస్తున్నారు.

ఇక సోమవారం సీఎం అశోక్ గెహ్లాట్ నిర్వహించిన సీఎల్పీ భేటికి సచిన్ పైలట్ వర్గం హాజరు కాని సంగతి తెలిసిందే. మరోవైపు సీఎల్పీ భేటిలో 106మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం నిలబడాలంటే కావాల్సిన 101మంది కంటే ఎక్కువే సీఎం అశోక్ గెహ్లాట్ కు ఉన్నారని స్పష్టమైంది.

అయితే మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని.. సీఎం ఇంట్లో కాదని సచిన్ పైలట్ వర్గం నేతలు సవాల్ చేశారు. సచిన్ బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శాసనసభా పక్షం నేడు మరోసారి భేటి కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఆ సమావేశం జరుగుతుందని సీనియర్ నేత సూర్జేవాలా వెల్లడించారు. ఆ భేటికి రావాలని తిరుగుబాటు నేత సచిన్ పైలెట్ కు సూచించారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు లేఖలు పంపించారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.