Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్యకేసులో ‘ఆది’కి సిట్ నోటీసులు

By:  Tupaki Desk   |   10 Dec 2019 1:21 PM GMT
వైఎస్ వివేకా హత్యకేసులో ‘ఆది’కి సిట్ నోటీసులు
X
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి షాక్ తగిలింది.

వైఎస్ జగన్ సీఎం అయ్యాక వివేకా హత్య కేసుపై స్పీడ్ పెరిగింది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సిట్ విచారణకు రావాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆది నారాయణరెడ్డికి నోటీసులు జారీ చేశారు.. రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకుండా ఆది తప్పించుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 41ఏ కింద అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో తాను అందుబాటులో లేనని ఆదినారాయణ రెడ్డి సిట్ అధికారులకు తాజాగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం ఆది నారాయణ రెడ్డి ని త్వరలోనే విచారించే కీలక తరుణం ఆసన్నమైందని తెలుస్తోంది.